నాగర్కర్నూల్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగా ణ) : నిజాం పాలనలో పేదలు భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేయడం తెలిసిందే. ఆయుధా లు, తుపాకులు చేతబట్టి రజాకార్లను ఎదిరించారు. అలాంటి నిరంకుశ పాలనలపై సాధారణ మహిళ అ యిన ఐలమ్మ ఆయుధం చేతబట్టి విజయం సాధించింది. దేశ్ముఖ్ల చెరలో ఉన్న భూములను విడిపించి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టింది. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కథనం..
వరంగల్ జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓ రుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు 1895 సెప్టెంబర్ 26వ తేదీన ఐదో సంతానంగా ఐలమ్మ జన్మించింది. ఆమెకు 14 ఏండ్ల వయస్సులో పాలకుర్తికి చెందిన చిట్యాల నరసింహతో వివాహం జరిగింది. ఐలమ్మకు ఐదుగురు కొడుకులు సోమయ్య, లచ్చయ్య, మత్తు లింగయ్య, లక్ష్మీ నర్సయ్య, ఉప్పలయ్య, కుమార్తె నర్సమ్మ జన్మించారు. ఐలమ్మది రజక వృత్తినే నమ్ముకున్న సాధారణ కుటుంబం. అ యితే, వ్యవసాయం చేసేందుకు మల్లంపల్లి భూస్వా మి కొండలరావుకు చెందిన 40 ఎకరాలు కౌలుకు తీసుకొని, నాలుగు ఎకరాలు సాగు చేసింది. ఆ ప క్కనే భూములున్న భూస్వామి, విస్నూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి నచ్చలేదు. ఆ భూమిని దక్కించుకునేందుకు పట్వారి శేషగిరిరావును ఉసిగొల్పాడు. తన పొలంలో పని చేయాలని శేషగిరిరా వు ఐలమ్మ కుటుంబాన్ని బెదిరించగా విభేదించి ఎదురు తిరిగింది. అప్పటికే సోమనర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ సంఘంలో స భ్యురాలిగా ఉన్న ఐలమ్మ ఈ చర్యలకు భయపడలే దు. ఆమె ఆధ్వర్యంలో భూస్వాములు, రజాకార్లపై పోరాటాలు చేశారు. ఇలా ఓ మహిళ పోరాటాలను నడిపించడం, తమ ఆధిపత్యానికి ఎదురు తిరగడం భూస్వాములకు నచ్చలేదు. సంఘం నాయకులతోపాటు ఐలమ్మపై కేసులు వేయించారు. న్యాయవాదిగా కొండాలక్ష్మణ్ బాపూజీ వాదించి తప్పుగా ని ర్ధారించడంతో కేసును కొట్టి వేశారు. దీంతో ఆర్థికం గా దెబ్బతీస్తే సంఘంలో ఐలమ్మ పట్టు కోల్పోతుందని భావించి.. ఆమె సాగు చేస్తున్న భూమిని దేశ్ముఖ్ తన పేరిట రాయించుకున్నాడు. పంటను కో సుకురమ్మని వంద మందిని పంపించాడు. ఐలమ్మ ఆధ్వర్యంలో ప్రజలు ఎదురు తిరిగారు. అప్పటికే సాగు చేసిన వరిని ఆంధ్ర మహాసభ కార్యకర్తలు కోసి, వరి కట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఇలా రెండుసార్లు కూడా ఐలమ్మపై దేశ్ముఖ్ ఓడిపోయారు. ఇది చూసి నాటి కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఐలమ్మ వద్ద కు చేరుకొని అభినందించి పార్టీలో చేర్పించారు. దీ న్ని జీర్ణించుకోలేని దేశ్ముఖ్ ఐలమ్మ ఇంటిని తగలబెట్టి, ధనాన్ని, ధాన్యాన్ని దోచుకెళ్లారు. కూతురుపై లైంగికదాడి చేశారు. దీంతో, ఐలమ్మ ఆధ్వర్యంలో ఆమె కుమారులు పాలకుర్తి పట్వారి ఇంటిని కూ ల్చి.. అదే స్థలంలో మొక్కజొన్న పంట పండించా రు. ఇలా ఎంత జరిగినా పోరాటం వీడని ఐలమ్మ రోకలి బండ చేతబట్టి గుండాలను తరిమి కొట్టింది. కాలి నడకన వెళ్లి దొరకు సవాల్ విసిరింది. ఐలమ్మ పోరాటం స్ఫూర్తితో కమ్యూనిస్టులు దాడి చేసి పాలకుర్తి దొర గడీలోని ధాన్యాన్ని, 90 ఎకరాల దేశ్ముఖ్ భూమినీ ప్రజలకు పంచారు. ఇలా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఐలమ్మ దున్నేవాడిదే భూ మి అంటూ జరిగిన పోరాటంలో దేశ్ముఖ్ల నిరంకుశత్వానికి ఎదురు తిరిగారు. 1944లో నల్ల నరసింహులు, చకిలం యాదగిరిరావు, దొడ్డి కొముర య్య, మాచర్ల కొండయ్య, కట్టంగూరి రాంచందర్ రావు, రావి నారాయణరెఢ్డిలతో కలిసి సభలు నిర్వహించారు. దేవరుప్పల, పాలకుర్తి, కడవెండి కేంద్రాలుగా దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టారు. రజాకార్ల పాలనలో పేదలకు ఒక్క పూట తిం డి కూడా దొరకని పరిస్థితులు ఉండేవి. రాత్రి వేళల్లో ఇలాంటి పేదలకు ఐలమ్మ అమ్మలా మారి వంట చే సి పెట్టడం జరిగిందని అంటుంటారు.
ఇలా ఐలమ్మ ధీరత్వం తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటంలో స్ఫూర్తిగా నిలిచింది. భూస్వాములు, రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న మరణించారు. అప్పటి నుం చీ ఐలమ్మ వీరత్వాన్ని నాటి పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ రజకులు, ఉద్యమకారుల కోరికలోని న్యాయాన్ని గుర్తించి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. వేడుకల నిర్వహణకు రూ.10 వేలు కేటాయించా రు. దీంతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆదివారం జరిగే జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇది రజకులతోపాటు ఉద్యమకారుల్లో, మహిళల్లో ఆ నందం నింపుతున్నది.