లింగాలఘనపురం, ఏప్రిల్8: సంక్షేమ పథకాలు అందిస్తూ, అభివృద్ధి పనులు చేపడుతూ సీఎం కేసీఆర్ దేశానికే రోల్మాడల్గా నిలిచారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురంలో బైరీసన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షాపు, కుందారంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, నవాబుపేటలో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభోత్సవం, కిష్టగూడెంలో నిర్మించనున్న పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కుందారంలో సర్పంచ్ చాడ సుగుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పలు గ్రామాల్లో పలువురు మృతి చెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. లింగాలఘనపురంలో మహిళాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాపింగ్ మాల్, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్కు రాకపోకల నిలిపివేత
మావోయిస్టుల చెర నుంచి జవాను రాకేశ్వర్సింగ్ విడుదల