మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య
తొర్రూరు, ఏప్రిల్ 3 : పట్టణాభివృద్ధికి ఆధునిక టెక్నాలజీని జోడిస్తున్నట్లు మున్సి పాలిటీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు పేర్కొన్నారు. డివిజన్ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిట్స్ సహకారంతో నిరుద్యోగ యువతకు ఆధునిక పద్ధతులతో భూమి కొలతలపై శిక్షణ ఇస్తుండగా, వారి సహకారంతో తొర్రూరు మున్సిపాలిటీ సమగ్ర సర్వేను నిర్వహించే బాధ్యత ను అప్పగించారు. డ్రోన్ కెమెరా సాయంతో పట్టణంలోని పూర్తి పరిధి సర్వే నంబర్ల ప్రాతిపాదికన పట్టణ స్వరూపం, భవిష్యత్లో ఎక్కడ రహదారులు, డ్రైనేజీల ని ర్మాణం చేపడితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, విషయాలపై సర్వే ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రాబోయే దశాబ్దాల కాలంలో చేపట్టనున్న నిర్మాణాలు ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుందో పరిశీలించడానికి ఈ సర్వే, కొలతల ప్రణాళిక ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు.
రెవెన్యూ అధికారుల సహకారంతో మున్సిపాలిటీ పరిధి లోని అన్ని సర్వే నంబర్ల స్థలాలు, అవాస ప్రాంతాలను గర్తిస్తామన్నారు. పట్ట ణం ఏ ప్రాంతాల్లో విస్తరిస్తోంది, ఎక్కడ నూతనంగా రహదార్లును నిర్మించడం, డ్రైనేజీ వ్యవస్థ పటిష్టపరిచేందుకు సర్వే ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులు ఇచ్చే నివేదిక ఆధారంగా భవిషత్లో అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయింపులు చేసుకునే అవకాశం లభిస్త్తుందన్నారు. రెండు రోజుల పాటు ఈ సర్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర, కిట్స్ శిక్షకులు హనుమాన్రావు, శ్యామ్, ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి