బడంగ్పేట: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో ఉన్న శ్రీసూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చైర్మన్ రెడ్డిగల్ల రత్నం ఎంపీ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రంజిత్రెడ్డి మాట్లాడుతూ సూర్యగిరి ఎల్లమ్మ 38వ వార్సికోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
మహిమ గల్ల అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొవిడ్ నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధు మోహన్, వైస్ చైర్మన్ భవాన్ని వెంకట్రెడ్డి, కౌన్సిలర్స్ రెడ్డిగల్ల సుమన్, శ్రీకాంత్, అశోక్ తదితరులు ఉన్నారు.