సికింద్రాబాద్ : సీతాఫల్మండి మెడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాలలో సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్ల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ సింగిల్ ట్రస్టీ పరికిబండ కళా ప్రకాశ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు శాలువాకప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో గురం పవన్కుమార్ గౌడ్, అశోక్, శ్రీనిఆస్ తదితరులు పాల్గొన్నారు.