దుబ్బాక, సెప్టెంబర్ 26 : తెలంగాణ సంస్కృతీ సంప్రాదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, ఈ పండుగకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ చీరలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు మండలంలోని రామక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు యూనిఫాం అందజేశారు. అనంతరం దవాఖాన ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కరశర్మ, వైద్యాధికారి కార్తీక్, ఆకారం, రామక్కపేట సర్పంచ్లు నాగభూషణం, పద్మాప్రభాకర్, ఎంపీటీసీలు లక్ష్మీనారాగౌడ్, శోభాస్వామి, నాయకులు పాల్గొన్నారు.
కొండపాక, సెప్టెంబర్ 26 : అన్నివర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ అన్నారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా ప్రజలంతా సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చీరలను అందజేస్తున్నదన్నారు. అనంతరం గ్రామానికి చెందిన లక్ష్మికి మంజూరై రూ.60 వేలు, శోభకు రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ స్కైలాబ్ పాల్గొన్నారు.
దౌల్తాబాద్, సెప్టెంబర్ 26 : టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ జ్యోతి అన్నారు. దౌల్తాబాద్ గ్రామ పంచాయతీ వద్ద మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గఫూర్, ఎంపీటీసీ వనిత, పంచాయతీ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.
రాయపోల్, సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమప్రాధాన్యత కల్పిస్తున్నదని సర్పంచ్ సంధ్యారాణీగణేశ్ అన్నారు. రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీపీ లక్ష్మి, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు రమేశ్, దుర్గయ్య పాల్గొన్నారు.
నారాయణరావుపేట, సెప్టెంబర్ 26 : మండల కేంద్రమైన నారాయణరావుపేటలో ఎంపీపీ బాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శశి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, ఎంపీడీవో మురళీధర్శర్మ, ఎంపీవో శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నంగునూరు, సెప్టెంబర్ 26 : నిరుపేద మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరలను అందజేస్తున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతి, ఉపసర్పంచ్ లచ్చవ్వ, మార్కెట్ డైరెక్టర్ లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 26 : పట్టణ పరిధిలోని రంగధాంపల్లిలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, కౌన్సిలర్ రేణుకాతిరుమల్రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కోహెడ, సెప్టెంబర్ 26 : మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు ఎంపీపీ కీర్తి బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మం గళవారం నుంచి అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు చీరలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కుమారస్వామి, శేఖర్, సర్పంచ్ కనకయ్య, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.