మెదక్ నెట్వర్క్ న్యూస్ సెప్టెంబర్ 26 : యావత్ ప్రపంచంలో పూలను గౌరమ్మగా పూజించి, వేడుకలను నిర్వహించే ఏకైక పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా రు. సోమవారం వెల్దుర్తి మండలంలోని మానేపల్లి, అందుగులపల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మానేపల్లి, అందుగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే ప్రారంభించి, యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు.
ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలో జీకేఆర్ గార్డెన్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్ వద్ద పార్కులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మేడి కల్యాణితో పాటు కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.