హుస్నాబాద్ టౌన్, జూలై 3 : వ్యాయామం కోసం పట్టణ వాసులకు మున్సిపల్ పాలకవర్గం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేస్తున్నది. హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్ట కింద పలు రకాల వ్యాయామ పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్ త్వరలో అందుబాటులోకి రానున్నది. వాకర్స్కు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణవాసుల ఆరోగ్యం కోసం మున్సిపల్ పాలకవర్గం తన బాధ్యతను నెరవేర్చేందుకు కృషిచేస్తున్నది. నిత్యం మార్నింగ్ వాకింగ్ చేసేవారి కోసం ఎల్లమ్మ చెరువు కట్ట కింద ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఆహ్లాదకర వాతావరణం నెలకొన్న ప్రాంతంలో ఓపెన్ జిమ్ పనులు చురుగ్గా కొనసాగుతుండడంతో పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు కరీంనగర్ రహదారిలో సైతం మరో ఓపెన్ జిమ్ను నిర్మించేందుకు మున్సిపల్ పాలకవర్గం యోచిస్తున్నది.
మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ను పట్టణవాసులు ఉపయోగించుకునే విధంగా నిర్మిస్తున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓపెన్ జిమ్లో ఉచిత ప్రవేశం కల్పించడంతో వాకర్స్కు ఎంతగానో ఉపయోగపడనున్నది. ప్రజలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేవిధంగా పలు రకాల వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
ఓపెన్ జిమ్ నిర్మాణానికి పట్టణ ప్రగతి ద్వారా నిధులు కేటాయించాం. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఓపెన్ జిమ్ను 15 రోజుల్లో పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతి ఒక్కరూ ఓపెన్ జిమ్ను ఉపయోగించుకునే విధంగా నిర్మిస్తున్నాం. ప్రజలు తమ ఆరోగ్యం కోసం వ్యాయామశాలకు రావాలి.
-రజితావెంకన్న, మున్సిపల్ చైర్పర్సన్, హుస్నాబాద్