ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
లబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
సిర్గాపూర్, మార్చి 29: అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్వగ్రామం ఖానాపూర్లో మండల పరిధిలోని బొక్కస్గాంకు చెందిన బాధితురాలు గాలి కిష్టవ్వకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.3లక్షల చెక్కును ఎంపీపీ మహిపాల్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ఒట్లా ఒడు ఒతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో వేలాదిమంది పేదలను ఆదుకున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, సకాలంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అంజయ్య, గోపాల్రెడ్డి, కృష్ణగౌడ్, రాజు సాయిగౌడ్ ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కల్హేర్, మార్చి 29: పొమ్యానాయక్ తండాలో ఆదివారం రాత్రి మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బిక్యానాయక్ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆదివారం తండాలో హోలీ సంబురాలను జరుపుకొని అందరితో కలిసి తిరిగారు. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే పిట్లం దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. బిక్యనాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.