మెదక్ మున్సిపాలిటీ/చిన్న శంకరంపేట సెప్టెంబర్ 28 : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన బృందావన్ కాలనీని మంగళవారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సందర్శించారు. రాయిన్పల్లి కెనాల్ నుంచి కాలనీలోకి వస్తు న్న వరద సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈకి ఫోన్లో ఆదేశించారు. కాలనీలో కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తూ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు సోములు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కిశోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మున్సిపల్ డీఈ మహేశ్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, సాధిక్, అంజాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్న శంకరంపేట మండలంలో 209 చెరువులు, కుంటలు ఉండగా.. 50 చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నా యి. మిగతా 159 చెరువులు, కుంటల్లోకి 90శాతం వరకు నీరు చేరింది.