మల్లన్నకు భారీగా పెరుగుతున్న ఆదాయం
ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా హుండీ కానుకలు
ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు
వసతుల కల్పనతోనే ఆదాయం : ఆలయ ఈవో
చేర్యాల, మార్చి 24 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి హుండీల ఆదాయం రికార్డు సృష్టిస్తున్నది. ఆలయ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఇటీవల జరిపిన హుండీల లెక్కింపుల్లో కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చింది. స్వామి వారి ఖజా నాకు భారీగా ఆదాయం వస్తుండడంతో ఆలయవర్గాల నుంచి ఆనందం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి వరంగల్, మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ఆదాయం లక్షలాది రూపాయలు వస్తే ఎంతో గొప్పగా ఉండేది. కానీ ప్రస్తుతం 22 రోజుల్లోనే కోట్లాది రూపాయాలు వస్తుండడంతో ఆలయ దశ, దిశ మారిపోయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత, కొమురవెల్లి సిద్దిపేట జిల్లాలోకి మారడంతో ఆదా యంలో దూసుకుపోవడమే కాకుండా అభివృద్ధిలో సైతం ముందుకు సాగుతున్నది. మల్లన్నకు ఇదే రకంగా ఆదాయం వస్తే, తెలుగు రాష్ర్టాల్లోని పెద్ద దేవాలయాల ఆదాయాన్ని సైతం దాటి ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయని ఆలయ వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో…
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల ప్రత్యేక శ్రద్ధ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవతో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందుతున్నది. భక్తులకు కనీస వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు కనీసం కొమురవెల్లి వైపు చూడని రోజులు ఎన్నో ఉన్నాయి. స్వామి వారి కల్యాణోత్సవానికి నియోజకవర్గ ఎమ్మెల్యే సైతం హాజ రుకాని పరిస్థితులు అప్పుడుండేవి. అదే తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన కల్యాణోత్సవానికి ఏకంగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం జరిగిన ప్రతి కల్యాణోత్స వానికి ఇద్దరు నుంచి ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యే హాజరు అవు తుండడంతో అదే స్థాయిలో మల్లన్న ఆలయానికి ప్రచారం సైతం పెరిరింది. దీంతో భక్తుల తాకిడితో పాటు ఆదాయం సైతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది.
మూడు సార్లూ రికార్డే..
మల్లన్న ఆలయ ఆదాయం మూడుసార్లు రికార్డులు సృష్టిం చింది. జనవరి 28న హుండీలు లెక్కించగా, రూ.82,30, 722 నగదు, 116 గ్రాముల మిశ్రమ బంగారం, 9కిలోల 400 మిశ్రమ వెండి, 2100 కిలలో మొక్కుబడి బియ్యం, 41విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. 25 రోజుల తర్వాత ఫిబ్ర వరి 23న మళ్లీ లెక్కించగా, రూ.1,03,59,877 నగదు, 130 గ్రాముల మిశ్రమ బంగారం, 12 కిలోల మిశ్రమ వెం డి, 2650 కిలలో మొక్కుబడి బియ్యం, 15 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. 22రోజుల తర్వాత మూడోసారి మార్చి 18న జరిపిన లెక్కింపుల్లో రూ.1,02,25,727 నగదు, 140 గ్రాముల మిశ్రమ బంగారం, 11కిలోల 500 మిశ్రమ వెండి, 38 క్వింటాళ్ల మొక్కుబడి బియ్యం, 64 విదేశీ కరెన్సీ నోట్లు స్వామి వారి ఖజానాకు సమకూరాయి. మూడు సార్లు జరి పిన లెక్కింపుల ద్వారా మల్లన్నకు రూ.2,88,16,326 ఆదా యం వచ్చింది. దీంతో పాటు 386 గ్రాముల మిశ్రమ బం గారం, 32 కిలోల900 గ్రాముల మిశ్రమ వెండి, 80 క్వింటాళ్లకు పై చిలుకుగా మొక్కబడి బియ్యం, 120 విదేశీ కరెన్సీలు వచ్చాయి.