ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
నిజాంపేట, సెప్టెంబర్ 22: మహిళలు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొందిన రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో నిర్వహించిన 4వ వార్షిక మండల మహిళా సమైక్య సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండల మహిళలు అందరూ ఒకేచోట సమావేశమయ్యేందుకు వీలుగా మండల సమైక్య భవనం మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బ్యాంక్ల ద్వారా రుణాలు పొంది మహిళలు ఏర్పాటు చేసుకున్న రెడీమెట్ గార్మెంట్, స్టీల్, మగ్గం, బేకరీ దుకాణాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా చల్మెడలో తిరుమలనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేశ్ సంబంధించిన ఓ ఫంక్షన్లో పాల్గొన్నారు.
పీఏసీఎస్ చైర్మన్కు ఎమ్మెల్యే పరామర్శ..
నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్ పప్పుల బాపురెడ్డి మాతృమూర్తి రాజమణి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్యాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రామాయంపేట మున్సిపాల్ చైర్మన్ జితేందర్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, రామాయంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు చంద్రం, అందె కొండల్రెడ్డి, డైరెక్టర్లు కలిసి బాపురెడ్డి, అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, ఆయా గ్రామాల సర్పంచ్లు అనూష, అమరసేనారెడ్డి, అరుణ్ కుమార్, గేమ్సింగ్, ఎంపీటీసీలు బాల్రెడ్డి, సురేశ్, మాజీ ఎంపీపీ సంపత్ తదితరులున్నారు.