కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వంద శాతం టీకా పంపిణీని పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ టీకాను చకచకా అందజేస్తున్నది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 15 రోజుల్లో వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. కరోనా థర్డ్వేవ్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించి గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసింది. కాగా, ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 22,496 మంది, సంగారెడ్డి జిల్లాలో 6,69,332 మంది రెండు విడుతల టీకాలు తీసుకున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
మెదక్/ సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 20:కరో నా కట్టడికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా 15 రోజుల పాటు కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాను చకచకా అందజేసేస్తున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి ఒక్కరికీ టీకాపై అవగాహన కల్పిస్తూ, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 5.37 లక్షల మంది..
జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 160 సబ్ సెంటర్లు, నాలుగు మున్సిపాలిటీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. అధికారుల అంచనా ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు 5,37,200 ఉండగా, ఇప్పటికే సుమా రు 3.40 లక్షల మందికి అంటే 60 శాతం వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన 2 లక్షల మందికి స్పెషల్ డ్రైవ్లో టీకా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కలెక్టర్ హరీశ్ ప్రత్యేక చొరవతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో వంద శాతం లక్ష్యం నెరవేరే దిశగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ప్రభు త్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించారు. దీంతో మొదటిరోజు 20 పీహెచ్సీల్లో మొదటి డోస్ 19,512 మంది, రెండో డోస్ 5,772 మంది తీసుకున్నారు. మొత్తం గా 25,284 మంది టీకా తీసుకున్నారు. శుక్రవారం మొదటి డోస్ 18,097 మంది, రెండో డోస్ 4399 మంది టీకా తీసుకున్నారు. మొత్తం 22496 మందికి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. శనివారం మొదటి డోస్ 13,726 మంది, రెండో డోస్ 3379 మంది మొత్తం 17,105 మంది టీకా తీసుకున్నారు. మూడు రోజులుగా 64,885 మంది టీకా తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 6,69,332 మందికి వ్యాక్సిన్..
సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 6,69,332 మంది వ్యాక్సిన్ను తీసుకున్నారు. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 7,519 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,837 మంది రెండో డోస్ తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు 10,848 మంది మొదటి డోస్ తీసుకోగా, 5,617 మంది రెండో డోస్ వాక్సిన్ను తీసుకున్నారు. 60 ఏండ్ల పైబడిన వారు 44,885 మంది మొదటి డోస్ వాక్సిన్ తీసుకోగా, 25,657 మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 నుంచి 59 ఏండ్ల వయసు వరకు 1,63,858 మంది మొదటి డోస్ తీసుకోగా, 69,763 మంది రెండో డోస్ వ్యాక్సిన్ను తీసుకున్నారు. 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వారు 2,65,558 మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోగా, 69,760 మంది రెండోడోస్ వ్సాక్సిన్ను తీసుకున్నారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 46శాతం మంది వ్యాక్సిన్ను తీయించుకున్నారు. కాగా, ఈ నెల 18వ తేదీ ఒక్కరోజు మాత్రమే 32,615 మంది వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్దఎత్తున మంది వ్యాక్సిన్ వేయించుకోవడం మొదటి సారి.
వంద శాతం లక్ష్యం చేరుకుంటాం..
మెదక్ జిల్లాలో వంద శాతం లక్ష్యం చేరుకుంటాం. 15 రోజుల స్పెషల్ డ్రైవ్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్యాంపులు ఏర్పాటు చేసి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నాం. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు 5.37 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 3.40 లక్షల మందికి టీకా వేశాం.
కరోనా రక్షణకు వ్యాక్సిన్ తప్పనిసరి..
కరోనా వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 6,69,332 మందికి వ్యాక్సిన్ అందించాం. ఇందులో మొదటి డోస్ 4,92,668, రెండో డోస్ 1,76,664 మందికి వ్యాక్సిన్ను వేశాం. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పీహెచ్సీ సబ్ సెంటర్లలో ప్రజలకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో ఈ నెల 18వ తేదీ ఒక్క రోజు మాత్రమే 32,615 మంది వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. వంద శాతం వ్యాక్సిన్ వేయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.