రామాయంపేట, అక్టోబర్ 19: విత్తనోత్పత్తిపై జిల్లాలో ఉన్న 40 మంది డీలర్లకు రామాయంపేటలో వరి పంటలపై క్షేత్రసాయిలో అవగాహన కల్పించారు. మంగళవారం 40మంది డీలర్లకు జి ల్లా వ్యాప్తంగా 40 వారాల పాటు వివిధ రకాల పం టలపై విత్తనం విత్తుకునే దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో హైదరాబాద్ వ్యవసాయ కేంద్రం నుంచి వచ్చిన ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు అమరేశ్, నరేందర్తో పాటు రామాయంపేట వ్యవ సాయ శాఖ అధికారిరాజ్ నా రాయణ అవగాహన కల్పిం చారు. రామాయం పేట శివారులో రవీందర్ అనే రైతు క్షేత్రాన్ని సందర్శించి వరి విత్తనంపై డీలర్లకు అవగాహన కల్పించారు. వాటిని ఎలా ప్యాకింగ్ చేస్తున్నారో వాటి జాగ్రత్తలపై వివరించారు. రైతు వేదికలో40మంది డీలర్లకు కోఆర్డినేటర్లు క్లుప్తంగా పంటల విధానాన్ని వివరించారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈవోలు పాల్గొన్నారు.