వర్గల్, సెప్టెంబర్ 18 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను విమర్శించే నైతికహక్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం మీనాజీపేటలో జరిగిన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నాయకులంతా సొంతడబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందన్నారు. ఎడ్యుకేషన్హబ్, రింగ్రోడ్డు, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణాలు, రైల్వేలైన్ ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ నాయకులకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్ల కుమార్యాదవ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వడ్డెపల్లి నాగరాజుతో పాటు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లత, జడ్పీటీసీ బాలమల్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, సర్పంచ్ గొల్ల లక్ష్మీసత్యం యాదవ్, కో-ఆపరేటివ్ మెంబర్ యాదగిరి, ప్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యవాది..
గజ్వేల్, సెప్టెంబర్ 18 : సీఎం కేసీఆర్ చేసిన అకుంఠిత దీక్షతో తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం 2014 జూన్ 2నే వచ్చిందని మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్లో సీఎం కేసీఆర్ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంచి ప్రజాస్వామ్య వాది అని, తెలంగాణకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే విజన్ ఉన్న నాయకుడన్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో వేదికపై నాయకులు అభివృద్ధి జరుగలేదంటుంటే వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలంతా గజ్వేల్ అభివృద్ధిని చూసి అద్భుతంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేయడం అందరికి తెలిసిన విషయమేన్నారు. గజ్వేల్లో గతంలో కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో, తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ హయాంలో ఈ ఏడేండ్లలో ఎంతటి అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ నాయకులకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పై చేసిన దురుసు వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్ ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ రాజిరెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్రావు, మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, నాయకులు దయాకర్రెడ్డి, అహ్మద్, కొండపోచమ్మ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.