నర్సాపూర్,అక్టోబర్17: పట్టణంతోపాటు పల్లె లోఅన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రతి గ్రామానికి, గిరిజన తండాలకు రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలం దౌలాపూర్ గ్రామం నుంచి నర్సాపూర్ మండలం కోక్యాతండా వరకు రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు, తండావాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నో ఎండ్ల నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాల చుట్టు తిరిగి తండావాసులు విసిగి పోయారు. నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపి రూ. 2 .80 కోట్ల ని ధులు పీఎంజీఎస్వై నుంచి మంజూరు చేయించారు.నిధులు మంజూరు కాగా నే అధికారులు యుద్ధ్దప్రాతిపదికన ప నులు ప్రారంభించి కేవలం 8 నెలల్లో పనులు పూర్తి చేశారు.
రోడ్డు నిర్మాణం 7 కిలోమీటర్లు వేయాల్సి ఉం డగా 5 కి.మీ వరకు వేశారు.వర్షాకాలం పూర్తి కాగానే మిగతా 2 కి.మీ నిర్మాణం చేపడుతామని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. రోడ్డు ని ర్మాణంతో దౌలాపూర్, మూసాపేట్, జైరామ్తండా, ఎల్లారెడ్డిగూడాతండా, కోక్యాతండా వా సులకు ఇబ్బందులు తొలిగిపోతాయి. రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే మదన్రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు తీరిన ఇక్కట్లు
రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక గ్రా మస్తులు, వాహనదారులు చా లా ఇబ్బందులు పడ్డారు. బీటీ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పను లు ప్రారంభించి కేవలం 8 నెల ల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేశా ం. ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం.
మదన్రెడ్డి ఎమ్మెల్యే
పనులు పూర్తి చేశాం :
రోడ్డు పనులు మంజూరు కాగానే యుద్ధ్దప్రాతిపదికన పనులు ప్రారంభించి 5 కి.మీ పూర్తి చేశాం. మిగతా 2 కి.మీ చేసే సమయంలో ఇద్దరి కాంట్రాక్టర్లలో ఒక కాంట్రాక్టర్ మృ తి చెందడంతో పనులు ఆగిపోయాయి. ఈ వర్షాకాలం పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం. -స్వామిదాస్ ,పంచాయతీరాజ్ ఏఈ