సబ్సెంటర్లలో వ్యాక్సినేషన్
మెదక్, సెప్టెంబర్ 17 : స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజూ శుక్రవారం జిల్లాలో 224 96 మందికి టీకా వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 160 సబ్ సెంటర్లలో స్పెషల్ డ్రైవ్ కింద 22,496 మందికి టీకా వేశామని తెలిపారు. అన్ని సబ్ సెంటర్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని అల్లాదుర్గం పీహెచ్సీలో 458 మందికి, చేగుంటలో 1035, డి.ధర్మారం పీహెచ్సీలో 1581 మందికి, గడిపెద్దాపూర్లో 217 మం ది, కౌడిపల్లిలో 1866 మంది, కొల్చారంలో 616, మెదక్ అర్బన్ పీహెచ్సీలో 1535 మంది, నార్సింగి పీహెచ్సీలో 812 మంది, పాపన్నపేటలో 664, పొడ్చన్పల్లి పీహెచ్సీలో 928, రంగంపేటలో 560, రెడ్డిపల్లి పీహెచ్సీలో 1720, రేగోడ్లో 370, సర్దనలో 1612, పెద్దశంకరంపేటలో 916, చిన్నశంకరంపేటలో 1002, శివ్వంపేట పీహెచ్సీలో 1722, టేక్మాల్లో 913, తూప్రాన్ పీహెచ్సీలో 2348, వెల్దుర్తిలో 1621 మందికి టీకా వేశామన్నారు.
చిన్నశంకరంపేటలో జడ్పీసీఈవో…
చిన్నశంకరంపేట,సెప్టెంబర్17: కరోనా వ్యాక్సిన్ను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని జడ్పీసీఈవో శైలేశ్ సూచించారు. మండలంలో ని జంగరాయి, కొర్విపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీ పీ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీవో గిరిధర్రెడ్డి, ఉన్నారు.
వ్యాకినేషన్ కేంద్రాలను పరిశీలించిన
-మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 17: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో ఏర్పా టు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారితో పాటు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే తీసుకోవాలని సూచించారు. చైర్మన్ వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రావు, కౌన్సిలర్ వసంత్రాజ్ ఉన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జయరాం నాయక్
అల్లాదుర్గం,సెప్డెంబర్17:వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా ప్రణాళికలు రూపొందించుకొని,అర్హులందరికీ వ్యాక్సి న్ తీసుకునేలా చూడాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారి జయరాం నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
మెదక్రూరల్లో…
మెదక్రూరల్ ,సెప్టెంబర్ 17: ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని మెదక్ డీఎల్పీవో సుధాకర్ అన్నా రు. మండల పరిధిలోని మంబోజిపల్లి లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మెదక్ డీఎల్పీవో సుధాకర్, సర్పంచ్ ప్రభాకర్ తో కలిసి వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు.