ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్,సెప్టెంబర్17: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఈ నెల 20వ తేదీన ఎనిమిది మండలాల టీఆర్ఎస్ మండల కమిటీ నియామక సమావేశం ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. నర్సాపూర్ ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ నెల 20న ఉదయం 11 గంటలకు మండల కమిటీ సభ్యుల నియామక సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు హాజరవుతారని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల గ్రామ కమిటీలు పూర్తయ్యాయని వెల్లడించారు. మండలాలకు చెంది న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ అనుబంధ సంస్థ లు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, వైస్ ఎంపీపీ నర్సింగరావు, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు అశోక్గౌడ్, టీఆర్ఎ మండలస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ నాయకుడు నగేశ్ పాల్గొన్నారు.
కొండాపూర్లో..
మనోహరాబాద్, సెప్టెంబర్ 17:మనోహరాబాద్ మండలం కొండాపూర్ టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు మహేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా ఆం జనేయులు, కార్యదర్శిగా బాలేశ్, యూత్ అధ్యక్షుడిగా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా అశో క్, బీసీ సెల్ అధ్యక్షుడిగా బాబు, ఉపాధ్యక్షుడిగా రాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమం లో సర్పంచ్ మమతరవి పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ను సన్మానించిన ఎమ్మెల్యే
కొల్చారం, సెప్టెంబర్ 17: మెదక్ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్గా నియామకమైన చంద్రశేఖర్రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి సన్మానం చేశారు. కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డికి మెదక్ మార్కెట్ కమిటీలో చోటు లభించింది. దీంతో చంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీ ఎల్లయ్య, మాజీ సర్పంచ్ మురళీగౌడ్తోపాటు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హైదరాబాద్లో ఎమ్మెల్యే మదన్రెడ్డిని కలిశారు.
విశ్వకర్మ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
నర్సాపూర్,సెప్టెంబర్17: మండల పరిధిలోని పెద్దచింతకుంట లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మక మిటీ చైర్మన్ శివకుమార్, వైస్ ఎంపీపీ నర్సింగరావు, విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కోశాధికారి మధుచారి, రి పాల్గొన్నారు.