వెల్దుర్తి, సెప్టెంబర్ 15: గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేసిన నియామక పత్రాలను ఎమ్మెల్యే మదన్రెడ్డికి అందజేసినట్లు వెల్దుర్తి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, మాసాయిపేట మండల ఇన్చార్జి మధుసూదన్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలంలో 21 గ్రామపంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీల్లో, మాసాయిపేట మండలంలో 13 గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామాల్లో పార్టీ గ్రామ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసిన కమిటీ నియామక పత్రాలను ఎమ్మెల్యేకు అందజేసినట్లు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి తెలిపారు. అన్ని గ్రామాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. సహకరించిన పార్టీ కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కౌడిపల్లి, సెప్టెంబర్ 15:కౌడిపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాలేరు శివాంజనేయులును ఎమ్మె ల్యే మదన్రెడ్డి సన్మానించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, దుర్గాగౌడ్ తదితరులున్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
నిజాంపేట,సెప్టెంబర్15: టీఆర్ఎస్తోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. కల్వకుంటలో ఆయన టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా గన్నారం వెంకట్గౌడ్, ఉపాధ్యక్షుడిగా రంగ రమేశ్, కార్యదర్శిగా రుద్రారం బాలపోచయ్య, కోశాధికారిగా కొమురయ్య, బీసీ సెల్ అధ్యక్షుడిగా నాగరాజ్గౌడ్, ఉపాధ్యక్షుడిగా రమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మహంకాళి, ఉపాధ్యక్షుడిగా మ్యాకలి రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా రాపోల్ వికాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగ అంజి, మహిళా అధ్యక్షురాలుగా సరిత, ఉపాధ్యక్షురాలుగా బ్యాగరి లత, మైనార్టీ అధ్యక్షుడిగా జాకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా ఖాజాపాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడికి పీఏసీఎస్ చైర్మన్ కొండల్రెడ్డి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో తిప్పనగుల్ల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవీందర్, టీఆర్ఎస్ నాయకులు రాము,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
రంగాయిపల్లిలో…
మనోహరాబాద్, సెప్టెంబర్ 15 : రాష్ట్రంలోబలమైన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని మండల అధ్యక్షుడు మహేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో నూతన గ్రామకమిటీని ఎన్నుకున్నారు. గ్రామకమిటీ అధ్యక్షుడిగా పెద్దబాల బాబు, ఉపాధ్యక్షుడిగా స్వామి, యూత్ అధ్యక్షుడిగా ఐలేశ్, బీసీసెల్ అధ్యక్షుడిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సునితతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, నాయకులు పాల్గొన్నారు.
మక్కరాజిపేటలో…
చేగుంట, సెప్టెంబర్15: చేగుంట మండలం మక్కరాజిపేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా యాదిరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా స్వామి, శివరాజ్, రవీందర్రెడ్డి, ఎండీ మునీర్షరీఫ్, ప్రధాన కార్యదర్శులుగా నాగరాజు, భిక్షపతి, స్వామి, రమేశ్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల నాయకుడు విశ్వేశ్వర్ ఉన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
కౌడిపల్లి,సెప్టెంబర్ 15: ఆడపిల్లలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి సంబంధించిన 26 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దాలవత్ రాజునాయక్, తహసీల్దార్ రాణాప్రతాప్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, మండల కో-ఆప్షన్ హైమద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎం పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఆశిరెడ్డి వర్ధంతిలో…
కౌడిపల్లిలో ఆశిరెడ్డి వర్ధంతి పురస్కరించుకుని ఎమ్మె ల్యే మదన్రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఉమ్మడి జిల్లా పరిషత్ వైస్చైర్మన్గా పనిచేసిన ఆశి రెడ్డి నిరుపేదల సమస్యల కోసం పోరాడేవాడన్నారు. కార్యక్రమంలో ఆశిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
గ్రామ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే