సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15 : టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారని, సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి గుండు భూపేశ్ తన అనుచరులతో పాటు 200మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీని ప్రజలు ఆదరించకనే ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సిద్దిపేటలో టీడీపీ ఖాళీ అయ్యిందన్నారు. ఒక నాడు కరువుతో అం బలి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేవాళ్లమని, నేడు పసిడి పంటలు పండి, బంగారు తెలంగాణగా మారుతున్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆసరా పెన్షన్ రూ.500 ఇస్తే, తెలంగాణలో రూ.3 వేలు ఇస్తుమన్నారు. రైతులకు 6 గంటలు కరెంట్ ఇస్తే.. తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నామన్నా రు. బీజేపీ తెలంగాణకు ఒక్క మంచి పనైనా చేసిందా? అని ప్రశ్నించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43కు 43 గెలిచి తీరాలన్నారు.
పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి..
కారు గుర్తుకు ఓటు వేస్తేనే టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వేసినట్లని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎన్నికలు అయిపోయినంక అప్పుల పాలైనా అని తన దగ్గరకు వస్తే చాలా బాధపడ్డానని తెలిపారు. ఎవరికి టికెట్ ఇచ్చినా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, నాయకులు వెంకటేశం, రాజేశం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
టాటూ వేయించుకుంటే ఏడాది పాటు బర్గర్లు ఫ్రీ
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్