చేగుంట/చిన్నశంకరంపేట/పాపన్నపేట/రామాయంపేట/మనోహరాబాద్, సెప్టెంబర్ 14 : పార్టీ బలోపేతం కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని మనోహరాబాద్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా బక్క రమేశ్, ఉపాధ్యక్షుడిగా సంతోష్, నవీన్, దుర్గారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా అమరేంద్రరెడ్డి, కోశాధికారిగా రాజు ఎన్ని కయ్యారు. సర్పంచ్ నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీహరి, నాయకుడు నరేన్ ఉన్నారు.
తూప్రాన్లో..
తూప్రాన్లోని 16వ వార్డు టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా బుక్క విజయ్కుమార్, యూత్ అధ్యక్షుడిగా నిసార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఫారూఖ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా శోభ, బీసీసెల్ అధ్యక్షుడిగా బాల్రాజ్లను ఎన్నుకున్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ నారాయణగుప్తా, పట్టణాధ్యక్షుడు సతీశ్చారి తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట మండలం, మున్సిపల్ వార్డులు, టీఆర్ఎస్ గ్రామ కమిటీలు పూర్తి చేసి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డికి జాబితాను అందజేసినట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్, మండలాధ్యక్షుడు పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ఇఫ్కో డైరెక్టర్ స్వగృహానికి వెళ్లి గ్రామ కమిటీలు, వార్డు కమిటీల జాబితాను అందజేసి రామాయంపేటలోని ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు ఇచ్చామని తెలిపారు. వారి వెంట నిజాంపేట టీఆర్ఎస్ నాయకులు మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ భాస్కర్రావు ఉన్నారు.
పాపన్నపేటలో..
పాపన్నపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వట్టిపల్లి ఉమామహేశ్వర్రావు ఎంపికైనట్లు సర్పంచ్ శ్రీనాథ్రావు వెల్లడించారు. ఉపాధ్యక్షుడి గా రమేశ్, కార్యదర్శిగా పట్నం మాణిక్యరావు, సంయుక్త కార్యదర్శిగా దుంపల ప్రవీణ్, కోశాధికారిగా మోహన్రావు ఎన్నికయ్యారు.
టీఆర్ఎస్ గ్రామకమిటీలు ఏకగ్రీవం
చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామకమిటీలను మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబాజిపేట టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా చాకలి లింగం, కార్యదర్శిగా రామకృష్ణ, జంగరాయి టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా గడ్డం సురేశ్, గవ్వలపల్లి టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా దూడ భిక్షపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ జ్యోతి, నాయకులు ఏకే యాదవరావు, ప్రభాకర్ పాల్గొన్నారు. చేగుంట మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు సజావుగా జరిగినట్లు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్కుమార్ తెలిపారు.