ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి
నారాయణఖేడ్, జూన్ 13 : నారాయణఖేడ్ నియోజకవర్గం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, అభివుద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్ను బలపర్చాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఖేడ్ మండలం పంచగామకు చెందిన వార్డు సభ్యుడితోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెనుకబాటుకు గురైన నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నదన్నారు. ఇతర నియోజకవర్గాలతో పోల్చితే ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గం ఎంతో పురోగతి సాధించిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ సరోజిని విఠల్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాయిలు ఆధ్వర్యంలో వార్డు సభ్యుడు రాజు సహా శంకర్, విఠల్, నాగయ్య, అంబాదాస్, రవి, అనిల్, జాషువా, గోపాల్, జైపాల్, ప్రేమ్కుమార్, ప్రభాకర్, శ్రీమాన్, నగేశ్, నర్సింహులు, పాండయ్య, రామయ్య, సంగయ్య లచ్చమ్మ, అంజమ్మ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, ఎంపీటీసీ అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ పరమేశ్, గంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఏస్గీ గ్రామస్తుల సన్మానం..
నాగల్గిద్ద మండలం ఏస్గీ గ్రామానికి కొత్తగా చెరువు నిర్మాణ పనులకు నిధులు మంజూరైన నేపథ్యంలో ఆదివారం నారాయణఖేడ్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఏస్గీ సర్పంచ్ రాజ్కుమార్, ఎంపీటీసీ సంతోశ్కుమార్ కలిసి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపి చెరువు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం గొప్ప విషయమని వారు కొనియాడారు.