కొల్చారం, సెప్టెంబర్ 11: మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు శనివారం జోరుగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన పార్టీ బాధ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ నేతృత్వంలో నియమాకపత్రాలను అందజేశారు.
సంగాయిపేట టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నారాయణ..
సంగాయిపేట గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పెద్ది నారాయణ, ఉపాధ్యక్షుడిగా దుర్గయ్య, కార్యదర్శిగా నవీన్, సంయుక్త కార్యదర్శిగా గోపాల్రెడ్డి, కోశాధికారిగా బన్సీలాల్తో పాటు 20మంది కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు.
సీతారాం తండా గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా హరిచంద్
టీఆర్ఎస్ సీతారాంతండా గ్రామ అధ్యక్షుడిగా హరిచంద్, ఉపాధ్యక్షుడిగా లాల్సింగ్, కార్యదర్శిగా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా లక్ష్మణ్, కోశాధికారిగా మాన్సింగ్తో పది మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఏటిగడ్డ మాందాపూర్ అధ్యక్షుడిగా రాజాగౌడ్
మండల పరిధిలోని ఏటిగడ్డమాందాపూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రాజాగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఎల్లయ్య, కార్యదర్శిగా జగన్నాథం, కోశాధికారిగా పద్మారావు, యూత్ కమిటీ అధ్యక్షుడిగా బీరయ్య, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా పాపయ్యను ఎన్నుకున్నారు. వీరికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ నియామక పత్రం అందజేశారు.ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల , మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల మండల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.
గ్రామ కమిటీ ఏర్పాటు
నిజాంపేట,సెప్టెంబర్11:మండలంలోని రాంపూర్లో శుక్రవారం మండల కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా యాదగిరి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కుమ్మరి భాస్కర్, కార్యదర్శిగా నర్సింహులు, కోశాధికారిగా రాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దుబ్బరాజుగౌడ్, పర్శగౌడ్, అంజాగౌడ్, గ్రామస్తులు ఉన్నారు.
వెంకటాపూర్(కే)లో…..
వెంకటపూర్(కే) గ్రామంలో సర్పంచ్ అనిల్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దయాకర్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా దుబ్బరాజు, ఉపాధ్యక్షుడిగా రవీందర్నాయక్, కార్యదర్శిగా కొమ్ము రమేశ్, కోశాధికారిగా నర్సింహులును కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గ్రామ అధ్యక్షుడికి సర్పంచ్ అనిల్కుమార్ నియామకపత్రం అం దజేశారు. కార్యక్రమంలో కల్వకుంట పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజేశం, డైరెక్టర్ సోమన్న మహిపాల్, టీఆర్ఎస్ నా యకుడు భాస్కర్గౌడ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ స్తులు ఉన్నారు.
ఆర్.వెంకటాపూర్లో..
రామాయంపేట, సెప్టెంబర్ 11: రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు సర్పంచ్ మహేందర్రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శిగా వెంకుగారి అభిలాశ్రెడ్డి, రైతు కమిటీ అధ్యక్షుడిగా దుర్గారెడ్డి, సెక్రటరీగా బాపురెడ్డి, బీసీ కమిటీ అధ్యక్షుడిగా ఎల్లం, యువత కమిటీ అధ్యక్షుడిగా రాజు, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా సునిల్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా కౌసల్యను ఏకగ్రీవంగాఎన్నుకున్నట్లు తెలిపారు.
11 గ్రామాల్లో కమిటీల ఏర్పాటు
నర్సాపూర్,సెప్టెంబర్11 : మండల పరిధిలోని 11 గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. పెద్దచింతకుంట గ్రామంలో అధ్యక్షుడిగా కుమ్మరి అంజయ్య, ఉపాధ్యక్షుడిగా పట్నం విట్టల్, గూడెంగడ్డలో అధ్యక్షుడిగా ఆవంచ సాయిలు, ఉపాధ్యక్షుడిగా బీర్ల శ్రీశైలం, తిరుమలాపూర్లో అధ్యక్షుడిగా అంబటి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి, తుజాల్పూర్లో అధ్యక్షుడిగా శ్రీరాం యాదయ్య, ఉపాధ్యక్షుడిగా గాలి రమేశ్, రెడ్డిపల్లిలో అధ్యక్షుడిగా మహేశ్గౌడ్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్, రాంచంద్రాపూర్లో సార లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా సీహెచ్ లక్ష్మయ్య, ఇబ్రహీంబాద్ గ్రామంలో లక్ష్మయ్య అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఎల్లారెడ్డి, మూసాపేట్లో అధ్యక్షుడిగా మల్లేశం, ఉపాధ్యక్షుడిగా శేఖర్గౌడ్, లింగాపూర్లో అధ్యక్షుడిగా లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యక్షుడిగా నర్స య్య, గొల్లపల్లిలో అధ్యక్షుడిగా కోల నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా బోగిని నర్సింహులు, చిప్పల్తుర్తిలో అధ్యక్షుడిగా లక్ష్మణ్గౌడ్, ఉపాధ్యక్షుడిగా లింగంపల్లి నర్సింహారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని చండూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాటారం విజయ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, యూత్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు విజయ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారు తెలిపారు. అనంతరం అధ్యక్షుడు విజయ్కుమార్కు నియామక పత్రం అందజేశారు. ఉపాధ్యక్షుడు అనం తం, కార్యదర్శిగా అంజిరెడ్డి, సభ్యులుగా దత్తు, ఖాసీం, గోపాల్, నాగరాజు , బాల్రాం, శ్రీనివాస్, శంకర్రెడ్డి, దేవేందర్రెడ్డి , కార్యక్రమంలోసర్పంచ్ స్వాతి జగన్మోహన్రెడ్డి, ఉప సర్పంచ్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
మనోహరాబాద్లో..
మనోహరాబాద్, సెప్టెంబర్ 11: తూప్రాన్ మండలం నాగులపల్లి, వట్టూర్ గ్రామాల్లో మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం నాగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధిరాంరెడ్డిని, వట్టూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా స్వామిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్, ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి పాల్గొన్నారు.
తూప్రాన్లో..
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో టీఆర్ఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా బాయికాడి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా ఉమ్మర్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఫకృద్ద్ధీన్, ఉపాధ్యక్షుడిగా ఎండీ గౌస్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్గౌడ్, యూత్కమిటీ అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షుడిగా రాం చంద్రం, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా షాహిన్బేగం, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మిని ఎన్నుకున్నారు.
చేగుంట మండలంలో…
చేగుంట, సెప్టెంబర్11: మండలంంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కర్నాల్పల్లిలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జనగామ రాములుగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కర్నాల్పల్లి అధ్యక్షుడుగా అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గణపురం సునీల్రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా లక్ష్మాపూర్ నవీన్,కార్యవర్గ సభ్యులుగాఎన్నుకున్నారు. పోతాన్పల్లిలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగన్గౌడ్,సర్పంచ్ కారిగుల సంతోష ఆధ్వర్యంలో పోతాన్పల్లి అధ్యక్షుడిగా బాలసాయి హరిప్రసాద్,ఉపాధ్యక్షులుగా తలారి నాగరాజు,మమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శిగా దొంతి స్వామి ఎన్నికయ్యారు. రాంపూర్లో సర్పంచ్ భాస్కర్ మండల నాయకులు సాయికుమార్ ఆధ్వర్యంలో రాంపూర్ అధ్యక్షుడిగా నాగులు, ఉపాధ్యక్షుడిగా లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా రఘుపతి, రుక్మాపూర్లో రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేశ్, సర్పంచ్ బస్కి స్వప్న, ఎంపీటీసీ గాండ్ల లత స్థానిక నాయకులు అంజిరెడ్డి,నందం,ఉప సర్పంచ్ మ్యాకల రాంచంద్రం ఆధ్వర్యంలో రుక్మాపూర్లో అధ్యక్షుడిగా మైలరాం రాంచంద్రం,ఉపాధ్యక్షుడిగా మాచిన్పల్లి రమేష్ ఎన్నికయ్యారు.