పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలి
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
దామరగిద్ద, ఏప్రిల్ 12 : పేదలకు వరం కల్యాణలక్ష్మి అని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన అ న్నారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వా రు హాజరై 70 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అం తకు ముందు మండలంలోని కానుకుర్తిలో సీసీ రోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాజీ స ర్పంచ్ రాజమణి ఙ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ను నా రాయణపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కరకుమారి ప్రారంభించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు సంబంధించి దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వ హించకుండా వెంటనే ఏర్పాట్లు చేయాలని, ఇంకా 174 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, త్వరగా దరఖాస్తులను పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ రమేశ్, ఎంపీపీ బక్క నర్స ప్ప, ఎంపీటీ సీ కిషన్రావు, సర్పంచ్ ఆశమ్మ, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
త్వరగా పూర్తి చేయాలి
ధన్వాడ, ఏప్రిల్ 12 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు త్వరగా పూ ర్తి చేసి పంపించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నా రు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై 32 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరం లాం టిదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను త్వరగా పంపించకుండా పెండింగ్లో ఉంచుతున్నారని స ర్పంచ్ అమరేందర్రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచితే చర్యలు తప్పవన్నారు. కల్యాణలక్ష్మి పథకంతోపాటు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపి ణీ చేశారు. సమావేశంలో ఎంపీటీసీలు ఉమేశ్కుమార్, మాధవి, సింగిల్విండో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, తాసిల్దార్ బాల్చందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘కార్యకర్తలకు బాసటగా నిలుద్దాం’
మరికల్, ఏప్రిల్ 12 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ బా సటగా నిలుస్తుందని, కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మం డలంలోని పెద్దచింతకుంటలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భగవంత్కు సభ్యత్వం ఉండడంతో ఆయన భార్య పార్వతమ్మకు పార్టీ తరఫున మంజూరైన రూ.2 ల క్షల బీమా చెక్కును మండలంలోని తాసిల్దార్ కార్యాలయ ంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. భగవంత్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రంలో స ర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ మంజుల, తీలేరు సింగిల్విండో చైర్మన్ రాజేందర్గౌడ్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
నారాయణపేట, ఏప్రిల్ 12 : టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పు డు కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎస్.రా జేందర్రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మండలంలోని పేరపళ్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మసిరెడ్డి వెంకట్రెడ్డికి పార్టీ తరఫున మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన అందజే శారు. అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలోని రహనబేగానికి రూ.12,500, సమ్రీన్ బేగానికి రూ.26,0 00, నర్సింహులుకు రూ.36,000, జహీరుద్దీన్కు రూ.6 0,000, నజీర్ అహ్మద్కు రూ.60,000ల చెక్కును పంపి ణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.