జడ్చర్లటౌన్, ఏప్రిల్ 12 : కరోనాపై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్లో కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన ఔట్ రీచ్ కేంద్రంలో కొవిడ్ టీకా మహోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మా స్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించా రు. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభు త్వం కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సెజ్లోని ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షలు చేయించుకున్న వారి ని మాత్రమే కంపెనీల్లో అనుమతించాలన్నారు. కొవిడ్ నివారణకు ప్రభు త్వం 45ఏండ్లు దాటిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తున్నదని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, పోలేపల్లి సెజ్లో పనిచేస్తున్న వారికి టీకా ఇచ్చేలా 10వేల వ్యాక్సిన్ డోసులు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదన లు పంపించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శశికాంత్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి, డీఐవో శంకర్, సెజ్ పరిశ్రమల ప్రతినిధులు, వైద్యుసిబ్బంది పాల్గొన్నారు.