కల్వకుర్తి, ఏప్రిల్ 3 : రాష్ట్ర అభివృద్ధిలో మమేకమయ్యేందుకే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం సండ్రలగడ్డ సర్పంచ్ మంజుల (కాంగ్రెస్), ఉపసర్పంచ్ రాజారెడ్డితోపాటు పలువురు గ్రామస్తులు శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరందించేలా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. మాడ్గుల మండలానికి ఎంజీకేఎల్ఐ 29వ ప్యాకేజీ డీ-82 ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపుగా పనులు పూర్తి అయ్యాయని, త్వరలో కృష్ణా జలాలు మాడ్గుల మండలం నాగిళ్ల వరకు వస్తాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం లభిస్తుందన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్కు చెందిన ఆరోగ్యరెడ్డి, ఇన్నారెడ్డి, మర్రెడ్డి, లూర్థురెడ్డి, ప్రతాప్రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.