గద్వాలటౌన్, ఏప్రిల్ 3 : రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలభవన్లో శనివారం జిల్లా స్థాయి కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవులు వినిపించిన కవిత్వాలు అందరిని అలరించా యి.ఎందరో కవులు తమ కవిత్వాలతో ఆహుతులను ఆకట్టుకునేందుకు కృషి చేశా రు. ఈ సందర్భంగా వారిని ప్రజాప్రతినిధు లు, అధికారులు ఘనంగా సత్కరించారు.
గ్రామ స్వరాజ్యం రావాలి: జెడ్పీ చైర్పర్సన్ సరిత
ప్రతి ఏడాది స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కాని ఇంకా గ్రామ స్వరాజ్యం రాలేదని, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రమని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. తెలంగాణ సాధించుకున్నాక స్వరాష్ట్రంలో ప్రభుత్వం అహర్నిశలు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఎంద రో త్యాగధనుల త్యాగఫలితం కారణంగా స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అమరుల త్యాగఫలమే స్వాతంత్య్రం: కలెక్టర్ శృతిఓఝా
ఎందరో అమరుల త్యాగఫలమే స్వాతంత్య్రమని కలెక్టర్ శృతి ఓఝా అన్నారు. అమరులను, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకే వేడుకలు జరుపుకొంటున్నామన్నారు.75వారాలపాటు స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగానే కవిసమ్మేళనాన్ని నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు..
కవులకు ఘన సన్మానం..
కవి సమ్మేళనంలో 43మంది కవులు పాల్గొన్నారు. వారందరూ వారి వారి కవితలతో అందరిని మెప్పించారు. ఈ సందర్భంగా కవులను జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, గ్రంథాలయ సంస్థ్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి సన్మానించారు. అనంతరం కవులకు రూ. 1116లతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, ఆర్డీవో రాములు, డీపీఆర్వో చెన్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు, సీపీవో లక్ష్మన్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.