వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 1 : నియోజకవర్గంలోని నాయకులకు సూచించిన పార్టీ సభ్య త్వ నమోదు లక్ష్యాన్ని ఆయా ఇన్చార్జిలు చేరుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని నియోజకవర్గంలోని పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో మంత్రి నిరంజన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ప్రధాన సమస్యలు ఉంటే నేరుగా తనకు వివరించి సమస్య పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని మంత్రి నాయకులకు సూచించారు. పార్టీ సూచించిన సభ్యత్వ నమోదు విషయంలో అక్కడక్కడ కొంతమంది ఇన్చార్జిలు అలసత్వం వహిస్తున్నారని, సూచించిన లక్ష్యాన్ని చేరుకుని పుస్తకాలను పూర్తి చేసి అందజేయాలని మంత్రి సూచించారు. లక్ష్యాలను పూర్తి చేసే సమయంలో శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో గ్యాప్ వచ్చిందని ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల కోడ్ లేనందున ఇన్చార్జిలకు ఇచ్చిన టార్గెట్ను రెండు రోజుల్లో పూర్తి చేసి సభ్యత్వ పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, ఆయా వార్డుల ఇన్చార్జిలు పాల్గొన్నారు.