ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
కోడేరు, ఏప్రిల్ 1: రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. మండలంలోని నర్సాయపల్లిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఎన్నో ఏండ్లుగా నర్సాయపల్లిలో ఇరుకుగా ఉన్న రోడ్డుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డార,ని ఇకపై వారికి ఇబ్బందులు తొలగిపోయినట్లేనన్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే వెళ్లలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితులను అధిగమించామన్నారు. రోడ్డు విస్తరణ కోసం గ్రామంలోని ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, సర్పంచ్ సత్యనారాయణయాదవ్, టీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యలు, గ్రామ ప్రజలు ఉన్నారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాష్ట్ర ప్రభుత్వం రూర్బన్ మిషన్ పథకం నుంచి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దకారుపాములలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణంకోసం రూ.4 కోట్లు, మామిడి రైతులకు మార్కెట్కోసం రూ.కోటి, కొత్తయాపట్ల, దేదినేనిపల్లి, పెరుమాండ్లపల్లి గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, దేవేందర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.