ఊట్కూర్, ఏప్రిల్ 1 : ఆడపిల్లలకు అండగా సీఎం కేసీఆర్ ఉంటున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువా రం ఏర్పాటు చేసిన తాసిల్దార్ తిరుపతయ్య అధ్యక్షతన వి విధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కొందరు వ్యక్తులు లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చే స్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై లంచం ఆశిస్తే సహించేది లేదని అధికారులను ఎమ్మె ల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆడబిడ్డల పెండ్లి పేద కుటుంబాల తల్లిదండ్రులకు భా రం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎవరైనా లంచం ఆశిస్తే ప్రజలు నేరుగా తమ దృష్టి కి తేవాలని సూచించారు. ప్రభుత్వం అందించిన చెక్కుల ను ఆడబిడ్డల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీపీ చాంబర్లో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమై సమస్యలపై చర్చించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాల ని తక్షణమే పరిష్కరిస్తామన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మ న్ బాల్రెడ్డి, సర్పంచుల సంఘం జి ల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స ర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పేదలకు వరప్రసాదం కల్యాణలక్ష్మి
మక్తల్ రూరల్, ఏప్రిల్ 1 : పేదలకు కల్యాణలక్ష్మి పథ కం వరప్రసాదంగా మారిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, మున్సిపల్ చైర్పర్సన్ పావని, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల, తాసిల్దార్ నర్సింగ్రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.