పీహెచ్సీల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం
రైతు వేదికలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం
దేశంలో సగం జనాభాకు అన్నం పెడుతున్న తెలంగాణ
మహబూబ్నగర్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 1 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ విధానంతో గ్రామీణులకు కూడా పీ హెచ్సీల్లో సూపర్ స్పెషాలిటీ వై ద్య సేవలు అందుతాయని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. గురువా రం మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో టెలీమెడిసిన్ సేవా కేంద్రా న్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టెలీమెడిసిన్ చేపట్టిందని, దీని ద్వారా రోగి ఎక్కడ ఉన్నా వైద్యం అం దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో టెలీమెడిసిన్ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. నిపుణులైన వైద్యులు ఆయా ప్రాంతాల్లోని ఏఎన్ఎంల నుంచి వైద్యసేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. పుట్టా శ్రీనివాస్, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ డీఎంహెచ్వో జీవన్, కౌన్సిలర్లు నీరజ, కమిటీ సభ్యులు వెంకన్న, మల్లేశ్, లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి కృషి..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 1 : రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనటువంటి రైతువేదికలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని ధర్మాపూర్, కోడూర్, ఓబ్లాయిపల్లిలో నిర్మించిన రైతు వేదికలను జెడ్పీచైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్లో కరివెన రిజర్వాయర్ నుంచి పాలమూరుకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు. దేశంలో సగం జనాభాకు అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. వరి పండించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. మాచన్పల్లి ద్వారా 8 కిలోమీటర్లు డబుల్ రోడ్ మంజూరైందన్నారు. అనంతరం కోటకదిరలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, కోడూర్లో పల్లె ప్రకృతి వనాన్ని, వాటర్ట్యాంక్ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, వ్యవసాయ అధికారిణి సుచరిత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, సర్పంచులు శ్రీకాంత్గౌడ్, రమ్య, చంద్రకళ, శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో వేదవతి, తాసిల్దార్ కిషన్, ఎంపీవో నరేందర్రెడ్డి, నాయకులు రవీందర్రెడ్డి, పాండు రంగారెడ్డి, రాఘవేందర్గౌడ్, వెంకటస్వామి, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలకు పరిష్కారం చూపాలి..
మహబూబ్నగర్, ఏప్రిల్ 1 : ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కా ర్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సంబంధింత అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాలతోపాటు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని ఆదేశించారు. సమస్యలను పెండింగ్లో పెడితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.
మహిళలకు చేయూతనివ్వాలి..
మహిళలకు మరింత చేయూతనివ్వాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రె డ్డి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, అధికారులు ఉన్నారు.
ఇంటర్ జేఏసీ ఆధ్యర్యంలో సన్మానం
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 1 : ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యంలో గురువారం క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు న్యాయం చే శారన్నారు. కార్యక్రమంలో ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ నర్సింహారెడ్డి, ప్రిన్సిపాళ్లు భగవంతాచారి, భీంరెడ్డి, అధ్యాపకులు మల్లికార్జున్, శ్రీనివాసులు, శివప్రసాద్, రఘువీర్సింగ్, హన్మంతరావు, చరణ్, నాగరాజు, ప్రవీణ్, మంజుల, రాజు, కొండయ్య, రవి, కవిత, శశికళ, రమేశ్, సాదిక్, నిజాం, ఖతాల్ తదితరులు పాల్గొన్నారు.