మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పర్యవేక్షించారు. మంగళవారం నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్లో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ సర్కిల్ -12 డిప్యూటీ కమీషనర్ ఇన్కెషాఫ్ అలీ, ఎఎంఓహెచ్ ఎజాజ్ ఖాసీంలను ఆదేశించారు.