దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతాంగం ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేసేలా రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి 30వ తేదీ వరకు క్లస్టర్ల వారీగా వ్యవసాయ శాఖ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి వచ్చే యాసంగి నుంచి కందులు, పెసర్లు, మినుములు, ఆముదాలు, పొద్దు తిరుగుడు, శనగలు, వేరుశనగ, నూలు, జొన్నలు, రాగులు, మక్క, కుసుమలు, పామాయిల్వంటివి సాగు చేసేలా అవగాహన కల్పించనున్నది. సులభ యాజమాన్యం, మార్కెటింగ్, అధిక లాభాలున్న పంటల గురించి అన్నదాతలకు వివరించి చైతన్యపరిచేందుకు సిద్ధమవుతున్నది.
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సాగులో రాణించాలి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. లాభాలు సాధించాలి. దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో సన్నరకాలు పండించడంతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించేలా అధికారులు అవగాహన కల్పించాలి. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలున్నాయన్న సంగతి గుర్తించాలి. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో నేనే స్వయంగా 15 ఎకరాల్లో సాగు చేస్త. వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, ఇతర కూరగాయల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి. అందుకు రైతుబంధు సభ్యులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 23, నమస్తే తెలంగాణ :రాబోయే రోజు ల్లో వరిసాగుకు గడ్డుకాలం వచ్చే అ వకాశమున్నది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలును నిలిపివేయనున్నది. దీంతో వరినే నమ్ముకున్న రైతులు నష్టపోయే పరిస్థితులు రానున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో రానున్న యాసంగి సీజన్లో వరికి బదులు ప ప్పు ధాన్యం పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ అ ధికారులు అవగాహన కల్పించనున్నారు. శుక్రవారం నుంచి క్లస్టర్లవారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినో ద్ కుమార్ తెలిపారు. రైతు వేదికలు, ఇతర ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరి పంటలు పండించిన రైతులకు మార్కెటింగ్తో పాటు కొనుగోళ్లకు ఎదురయ్యే ఇబ్బందులను ఏఈవోలు వివరించనున్నారు. వచ్చే సీజన్లోనూ వరి సాగు చేస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. వరిసాగు చేసేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుంది. రైతులు పొలం చదు ను చేయడంతో ప్రారంభించి నేలను దమ్ము చేయడం, నారు పెంచడం, నాట్లు వేయడం, కలుపుతీయడం, నీళ్లు అందించ డం, పురుగు మందు లు, పంట కోత, నూర్పిళ్లు చేయడం, తూ ర్పా ర పట్టడంతో పాటు వడ్లు ఆరబెట్టాల్సి ఉం టుంది. తర్వాత మార్కెట్కు తీసుకెళ్లి అ మ్మాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వరి 150 రోజు ల్లో, మధ్యకాలిక వరి 135 రోజుల్లో, స్వల్ప కాలిక వరి 120 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఇలా వరి పండించేందుకు నెలల తరబడి కా లం కావడంతో పాటు సాగునీళ్లు అధికం అవుతాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే, అధి క వర్షాలు కురి స్తే, నార్లు ఆలస్యమైతే పంట సాగు, దిగుబడి కష్టమవుతుంది. ఇక కొనుగోళ్లు కూడా వచ్చే సీజన్ నుంచి నిలిపివేయనుండడంతో పప్పు పంటలే ప్రత్యామ్నాయమని వ్యవసాయ అధికారులు తేల్చి చెబుతున్నారు. అదే నూనె గింజల సాగుతో రైతులు తక్కువ సమయంలో అధికలాభాలు అర్జించే అవకాశాలు ఉన్నాయి. కంది, పెసర్లు, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు, శనగలు, వేరుశనగ, నూలు, జొన్నలు, రాగులు, మొక్క జొన్న, కుసుమలు, పామాయిల్ వంటి పంటలను సాగు చేయాలని సూచిస్తున్నది. ప్రస్తు తం మార్కెట్లో ఈ పంటలకు అధికంగా డి మాండ్ ఉంది. విదేశాల నుంచి ఈ పంటల ఉత్పత్తులు దిగుమతులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ పంటలను అంతరపంటలుగాను, వర్షాధారంగానే కా కుండా నీటి పా రుదల కింద కూడా సాగు చేయవచ్చు. భూ ములు నిస్సారం కాకుండా కాపాడుతుంది. ప ప్పు ధాన్యపు పంటల ద్వారా పశువులకు మేత కూడా లభిస్తుంది. నేల కోత లు తగ్గుతా యి. నాలుగేండ్లలో చేతికి వచ్చే ఆయిల్ పా మ్లో అంతరపంటలుగా వేరు శనగ, కందు లు, మొక్కలు, పెసర్లు సాగు చేసుకోవచ్చు. ఇ లా సులభ యాజమాన్యం, అధిక డి మాం డ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలతో రైతులు ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు. రైతు వేదికలు, ఇతర ప్రాంతాల్లో నేటి నుంచి ఈ నెల 30 వరకు వ్యవసాయ శాఖ ద్వారా ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని 55 క్లస్టర్ల పరిధిలో వారం రోజుల పాటు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు డీఏవో వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో ఆరుతడి పంటలు, వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించేలా శుక్రవారం నుంచి అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వానకాలంలో 3లక్షల 35వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. యాసంగిలో వరి సాగును వీలైనంత వరకు తగ్గించేలా అధికారులు ప్ర యత్నిస్తున్నారు. శుక్రవారం నుంచి జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 70 క్లస్టర్లలో రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తారు. వరికి బదులు వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, ఇతర స్వల్పకాలిక పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. యాసంగిలో వరి సాగు చేయడం వల్ల కలిగే ఇబ్బందులతో పాటు ప్రత్యామ్నాయ పంటలతో కలిగే లాభాలను వివరిస్తారు.
ప్రత్యామ్నాయ పంటలే మేలు..
వరి విస్తీర్ణం తగ్గించుకోవడం, 30 నుంచి 40 శాతం మేర వేరే పంటలకు మరలడంపై వారం పాటు అవగాహన సదస్సులు నిర్వహించనున్నాం. యాసంగిలో ప్రధానంగా వరి తో పాటు కనీసం 40 శాతం ఇతర పంటలు వేసుకోవాలి. నూలు, శనగలు, వేరు శనగలు, పొద్దు తిరుగుడు, జొన్నలు, కుసుమలు.. పెసలు, మినుములు.. ఇలా వేసుకోవడం మం చిది. మన జిల్లాలో కొన్నిచోట్ల జనుము కూడా పండిస్తుంటారు. జనుముకు భారీగా డిమాండ్ ఉంది. వరి తప్పక వే సుకోవాల్సిన పరిస్థితుల్లో సన్నరకం వల్ల మేలు కలుగుతుంది.
వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, మంచిర్యాల