45 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా టీకా వేసుకోవాలి
అవగాహన కల్పిస్తున్న వైద్యులు
ఇచ్చోడ, ఏప్రిల్ 12: కొవిడ్ టీకా సురక్షితమని, 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఇచ్చోడ, నర్సాపూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారులు ఆకుదారి సాగర్, రాథోడ్ రవి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు టీకా వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాపై అపోహలొద్దు
బజార్హత్నూర్, ఏప్రిల్ 12: కొవిడ్ టీకాపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని వైద్యాధికారి సురేశ్, ఎంపీడీవో దుర్గం శంకర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 45ఏళ్లు దాటిన వారికి టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీవో మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిరికొండ, ఏప్రిల్ 12: కరోనా రెండోదశ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ డాక్టర్ అశోక్ అన్నారు. పిట్టబొంగరం పీహెచ్సీకి సిరికొండ, రాంపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి కొవిడ్ టీకా వేసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో 48 మందికి టీకా వేశామని తెలిపారు. వైద్యసిబ్బంది విజయ్ సుందరి, ఆనంద్, సాయి పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు టీకా
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 12: జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో 45 ఏళ్లు నిండిన ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ టీకా వేయించుకున్నారు. అలాగే ఆదిలాబాద్ ఆర్ఎం విజయభాస్కర్ దంపతులు టీకా తీసుకున్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు 290 మంది ఆర్టీసీ ఉద్యోగులు టీకా వేయించుకున్నట్లు ఆర్ఎం తెలిపారు.
పంచాయతీ ఉద్యోగులకు..
తలమడుగు, ఏప్రిల్ 12: మండల కేంద్రంలోని పీహెచ్సీలో పంచాయతీ శాఖ ఉద్యోగులు కొవిడ్ టీకా వేయించుకున్నారు. సోమవారం 70 మంది టీకా వేసుకున్నట్లు మండల వైద్యాధికారి రాహుల్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్ పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 12: మండల కేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్ టీకా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి వాణి మాట్లాడుతూ టీకా వేసుకున్న వారు రెండో డోస్ 28 రోజుల తర్వాత తీసుకోవాలన్నారు. అలాగే లక్షణాలున్న వారు పీహెచ్సీకి వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం
916 కేడీఎం గోల్డ్ దోశ.. రేటెంతో తెలుసా?