నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్10: నిర్మల్లోని బత్తీస్ఘడ్ సమీపంలో వీరశైవ మతానికి చెందిన జంగాలమఠం వద్ద అరుదైన వీరగల్లు విగ్రహం వెలుగు చూసింది. ప్రముఖ కవి, పరిశోధకుడు తుమ్మ ల దేవరావు, అ య్యన్న పోశెట్టి ఈ విగ్రహాన్ని గుర్తించారు. యుద్దాల్లో మృతిచెందిన వీరులను గుర్తుచేసే స్మారక శిలలను వీరగల్లులుగా పిలుస్తారని వారు పేర్కొన్నారు. గ్రామరక్షణ కోసం పోరాడి వీరమరణం పొందిన వారిని, పాడిపంటలను రక్షించినవారిని స్మరించుకునేందుకు ఇటువంటి స్మారక శిలలను ఏర్పాటు చేస్తారన్నారు. నిర్మల్ జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి శిలలు వెలుగు చూసినట్లు ఆయన పేర్కొన్నారు. జంగాలమఠం వద్ద ఉన్న విగ్రహం పులిమడుగుకు దగ్గరగా ఉన్నట్లు చెప్పారు. పులిమడుగు వద్ద మరాఠాలకు, మొగలులకు పలుమార్లు యుద్దాలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నదన్నారు. ఈ విగ్ర హం ఒక చేతిలో డాలు, ఒక చేతిలో బల్లెం ఉండడంతో వీరుడిదే కావచ్చని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కరోనా పాజిటివ్