కోటపల్లి, ఏప్రిల్ 6 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జైపూర్ ఏసీపీ నరేందర్ సరిహద్దులను సందర్శించి చెన్నూర్ రూర ల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులతో తనిఖీలు చేపట్టా రు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలను చేయడంతో పాటు అంతర్రాష్ట్ర వంతెన వద్ద సరిహద్దులను పరిశీలించారు. మావోయిస్టుల సిద్ధ్దాంతాలను నమ్మి వారి బాట పట్టి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
అనుమానితుల సమాచారం ఇవ్వండి
నెన్నెల, ఏప్రిల్ 6 : గ్రామాలకు ఎవరైనా కొత్తగా వచ్చి అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీశ్ కోరారు. మండలంలోని అటవీ గ్రామాల్లో ఆయన స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో తొర్రెంలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నెన్నెల బెల్లంపల్లి రో డ్డు, కోణంపేట, కుష్నపల్లి, జంగాల్పేట, మన్నెగూ డెం గ్రామాల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భం గా సీఐ పలు గ్రామాల్లో ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలెవరూ మావోల సిద్ధాంతాలను నమ్మవద్దని సూచించారు. ఎస్ఐ రమాకాంత్ సీఎస్ఐలు మనోజ్,శ్రీకర్, పీసీ కృష్ణ, పాల్గొన్నారు.