ప్రారంభమైన బల్దియా ఎన్నికల సందడి
తొలి రోజు అచ్చంపేటలో 4 నామినేషన్లు దాఖలు
టీఆర్ఎస్ నుంచి మూడు, ఒకటి కాంగ్రెస్ నుంచి..
జడ్చర్ల మున్సిపాలిటీలో నిల్
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 16 : జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భా గంగా పకడ్బందీ ఏ ర్పాట్లు చేశా రు. మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేం ద్రంలో మూడు వార్డులకో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశా రు. ఒక్కో కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించారు. కొవిడ్ నిబంధనల మే రకు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. నామినేషన్లకు వచ్చిన వారు భౌతికదూరాన్ని పాటించేలా గుర్తులు వేశారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు సూచిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మొదటి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ఫారాన్ని తీసుకెళ్లారు.
అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు..
అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు ఆధార్కార్డు లేదా పాన్కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం లేదా ఫారంపై గజిటెడ్ అధికారి అటెస్టేషన్, కార్యాలయం ము ద్రతో ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అభ్యర్థి, అతడిని బలపరిచే వారి వివరాలు ఉన్న ఓటరు జాబితా జిరాక్స్, నామినేషన్ డిపాజిట్ డబ్బులు, రాజకీయ పార్టీల నుంచి బలపరిచే అభ్యర్థులు మాత్రం ఫారం-ఏ, బీ అందజేయాలి. డిక్లరేషన్ ఫారంలో ఆదాయం, కోర్టు కేసులు, స్థిర, చరాస్తులు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ స మర్పించాలి. ఇంటి, నల్లా ట్యాక్స్ బకాయిలేనట్లుగా నో డ్యూ సర్టిఫికేట్ అందజేయాలి
అచ్చంపేటలో నాలుగు నామినేషన్లు..
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 16 : అచ్చంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల పర్వం మొదలైంది. శుక్రవారం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 2వ వార్డు నుంచి టీ ఆర్ఎస్ అభ్యర్థి సుంకరి నిర్మల, 14వ వార్డు నుంచి కాం గ్రెస్ అభ్యర్థి గార్లపాటి శ్రీనివాస్, 18వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గోపిశెట్టి శివ, 20వ వార్డు నుంచి టీఆర్ఎ స్ అభ్యర్థి రమేశ్రావు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మొదటి రోజు కావడంతో అంతగా సందడి కనిపించలేదు. మరో రెండు రోజులు సమయం ఉండడంతో నేడు, రేపు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్
నగర సుందరీకరణ.. ఆకర్షణీయంగా ఫుట్పాత్లు