తెలంగాణ వచ్చాకే గుర్తింపు వచ్చింది
గొర్రెల సంపదలో మొదటి స్థానం
ఉచిత గొర్రెలతో ఆర్థికలబ్ధి పొందాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
తిమ్మసానిపల్లిలో రూ.62 లక్షల విలువైన గొర్రెలు పంపిణీ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 8 : ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తులకు తగిన గుర్తింపు వచ్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపా రు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని తిమ్మసానిపల్లి గ్రామంలో రూ.62.50 లక్షల విలువ చేసే 50 యూనిట్ల గొర్రెలను యాదవులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం గొర్రెల సంపదలో మొదటి స్థానంలో ఉందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత మహబూబ్నగర్ జిల్లాలోనే రూ. 315 కోట్ల విలువైన 5,27,835 గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి కూడా గొర్రెల పంపిణీ చేపడుతామని, యాదవుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రూ.200 కోట్ల విలువ చేసే వలలు, లునాలను పంపిణీ చేశామన్నారు. ఎస్సీ కు లవృత్తుల వారికి వెయ్యికోట్లతో త్వరలోనే పథకాలు రా నున్నట్లు వెల్లడించారు. అన్ని కులవృత్తుల వారిని ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. తిమ్మసానిపల్లిలో గతంలో అనేక సమస్యలు ఉండేవని, ప్రస్తుతం ఇంటింటికీ తాగునీరు, సీసీ రోడ్లు వేయించామని, పక్కనే ఉన్న తండాలో కూడా మిషన్ భగీరథ నీరందుతుందన్నారు. త్వరలోనే బీటీ రహదారి వేయనున్నట్లు తెలిపారు. యాదవులు గొ ర్రెలను అమ్ముకోవద్దని కోరారు. అనంతరం గొర్రెల యూనిట్ల ప్రొసీడింగ్స్ను లబ్ధిదారులకు అందజేశారు. కా ర్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, పశుసంవర్ధకశాఖ జేడీ మధుసూదన్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ రామ్లక్ష్మణ్, యాదవ సంఘం నాయకులు వెంకటేష్, రవి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంపై పెరిగిన విశ్వాసం
పేదల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న విశ్వాసం వారిలో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కా ర్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్ర జా వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అదే రోజే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు పరిష్కారమైన తర్వాత సంబంధిత వ్యక్తులకు మెసేజ్ చేయాలని, ఫోన్ ద్వారా కూడా తెలియజేయాలన్నారు. ప్రజావేదిక ద్వారా ఇప్పటి వరకు 246 ఫిర్యాదులు రాగా 193 ను పరిష్కరించామని, మరో 53 పెండింగ్లో ఉన్నాయ ని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ పీఆర్వో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ.45,43,268 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ కార్మికులు మృతి చెందితే రూ.6 లక్షలు, పూ ర్తిగా అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు, సహజ మర ణం పొందితే ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్మికుడి కూతురు వివాహ కానుకగా రూ.30 వేలు, ప్ర సూతి సాయం కింద రూ.30 వేలు, అనారోగ్య వైద్య చికి త్స నిమిత్తం రూ.9 వేలు, కార్మికులు మరణిస్తే దహన సంస్కారాల కోసం రూ.30 వేలు, వృత్తి నైపుణ్యం శిక్షణ కు రూ.4500 అందించనున్నట్లు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని భరోసా కలిపంచారు. జిల్లా దవాఖానలో 2014లో 70 ప్రసవా లు జరగా.. ఇప్పుడు 2,300 వరకు పెరిగాయన్నారు. జి ల్లాలో న్యాక్తోపాటు ఎల్అండ్టీ సెట్విన్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కార్మిక శాఖ ద్వారా సాయం కోసం ముందుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎల్అండ్టీ ద్వారా ఎలక్ట్రికల్, న్యాక్ ద్వారా మేస్త్రీ, సెట్విన్ ద్వారా మరో రకమైన శిక్షణను అందిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన 17 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రా లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రానివ్వొద్దు
రాత్రి, పగలు తేడా లేకుండా పండించిన ధాన్యం కొ నుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రూ.20 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేసి రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్య లు తీసుకున్నారని తెలిపారు. 2014 సంవత్సరంలో జిల్లాలో రైస్ మిల్లులు మూతపడే స్థాయి ఉండేదని, ప్రస్తు తం మిల్లులో ధాన్యం పట్టనంతగా జిల్లాలో పండుతున్నదన్నారు. గత సంవత్సరం వచ్చిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. బ్యాగుల కొరత రాకుండా చూడాలని జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం ధా న్యం కొనుగోలు పూర్తి బాధ్యతను తాసిల్దార్ తీసుకోవాలని, మిల్లర్లు కూడా ఎక్కడ ధాన్యం ఆపకుండా ఎప్పటికప్పుడు తరలించాలని చెప్పారు. అవసరమైతే ప్రైవేటు ఫంక్షన్ హాల్ను కూడా తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు సహకరించకపోతే బ్లాక్ లిస్ట్లో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, దేవరకద్ర, పరిగి ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రె డ్డి, మహేశ్రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎస్వో వనజాత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గో పాల్యాదవ్, వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
కర్ణాటకలోని ఏడు నగరాల్లో 10 నుంచి నైట్ కర్ఫ్యూ
అడగకపోయినా వరాలిస్తున్న సీఎం కేసీఆర్
ఉపాధి పనుల్లో ఎంపీటీసీ దంపతులు