ప్రభుత్వ బడుల్లో సమస్యలకు చెక్
పూర్తి స్థాయి వసతులపై సర్కార్ నజర్
జిల్లాలోని అన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరా
కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 8 : ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చి.. సకల సౌకర్యాలు కల్పించి.. వాటి రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం నిధులు విడుదల చేస్తుండ టంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. పాలమూరు జిల్లాలోని బడుల స్థితిగతులపై ఇప్పటికే 53 అంశాలతో కూడిన నివేదికను అధికార యంత్రాంగం నుంచి సేకరించింది. నిధులు విడుదలతో సొబగులు సంతరించుకోనున్నాయి. ఇక కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దు కోనుండగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్ర భుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా నాలుగు వేల కోట్ల నిధు లు కేటాయించింది. వీటిని సకాలంలో ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. అవసరమైన చోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మించాలని భావిస్తున్నది. ఇప్పటి కే ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే విద్యా సంవత్సరం కంటే ముందుగానే సమస్యలను పరిష్కరించేందుకు రంగం సి ద్ధం చేసింది. ఇందుకోసం పాఠశాలల్లోని 53 అం శాలతో కూడిన జాబితాను ఆన్లైన్లో నమోదు చేశారు. త్వరలో పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నది.
మరింత బలోపేతం దిశగా..
ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఇప్పటికే ఆ ధునికంగా తీర్చిదిద్దింది. వీటిని మరింత బలోపే తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కొన్న చోట్ల పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకో గా, ఆ గదుల్లోనే విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఇలాంటి పాఠశాలలను గుర్తించి.. వీటి స్థానంలో కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
వివరాల సేకరణ..
మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 53 అంశాలతో కూడిన వివరాలను ఎంఈవోలు, నోడల్ అధికారులు హె చ్ఎంల నుంచి సేకరించారు. వీటిని ప్రత్యేక యా ప్లో పొందుపరుస్తున్నారు. పాఠశాలల విద్యార్థు ల సంఖ్య, తరగతులు, కమ్యూనిటీల వారీగా టీ చింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, అదనపు తరగతి గదులు అవసరం ఉన్నా యా..?, ఎంత స్థలం అందుబాటులో ఉంది..? ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి…? డెస్క్లు, సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్లు, విద్యుత్ సరఫరా, బ్లాక్బోర్డులు, తాగునీటి సౌకర్యం, ప్రహరీ ని ర్మాణం, ప్రొజెక్టర్, ఆటస్థలం, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు తదితర వివరాలు సేకరించారు. మహబూబ్నగర్ జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలు ఉం డగా, వీటిలో 632 ప్రాథమిక, 90 ప్రాథమికోన్నత, 154 ఉన్నత పాఠశాలలు, 14 కేజీబీవీలు, ఒక మోడల్ స్కూల్, అర్బన్ రెసిడెన్షియల్ ప్రై మ రీ, హైస్కూల్ పాఠశాలల్లో కలిపి 74,632 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల కొత్త భవనాలు నిర్మించారు. మరికొన్ని చోట్ల ఉన్న భవనాలకు మెరుగులు దిద్దుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దనుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నివేదికలు సిద్ధం చేస్తున్నాం..
జిల్లాలోని 876 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సూచించిన 53 అంశాల నివేదికలను సిద్ధం చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. పాఠశాలల్లో సమస్యలు శాశ్వతంగా దూరం కానున్నాయి.