మహబూబ్నగర్, అక్టోబర్ 13 : అతి భారీ వర్షాలతో మహబూబ్నగర్ పట్టణంలోని లోత ట్టు, మెట్ట ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరుతున్నదని.., వరద ముప్పు తొలగేలా శాశ్వత పరిష్కారం చూపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నుంచి పారుతున్న వర్షపునీరు, నూతన నాలాల ఏర్పాటు పనులు, రామయ్యబౌళి పరిసరా ప్రాంతాలను కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్పవార్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 ఫీట్లలో ఉండాల్సిన నాలాలు కేవలం 5 ఫీ ట్లు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో న్యూటౌన్, బ స్టాండ్, రూరల్ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో చిన్నపాటి వ ర్షం కురిసినా నీరు నిలిచేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్నా రు.
మరో 100 ఏండ్ల వరకు వరద నీరు ముంచెత్తే ఆ స్కారం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాపడమే ల క్ష్యంగా రెండు నెలలుగా శ్రమిస్తున్నామన్నారు. పనిచేస్తు న్న నేతలు, అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటివరకు పెద్దచెరువు తూము పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. వర్షపునీరు దిగువకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్న కాల్వల్లో ప్లాట్లు కోల్పోయిన వారు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను సమర్పిస్తే న్యాయం చేస్తామని చెప్పారు. మంచి చేయాలనే తపనతో ప్రతి క్షణం పరితపిస్తున్నామని, తెలిసీతెలియని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చెరువులోకి నీరు వదిలితే.. నిండిన తరువాత అలుగుపారుతుందన్న విషయం కూడా తెలియడం లేదన్నారు.
ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అప్పన్నపల్లి వద్ద 12 ఏండ్లపాటు ఒక బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తక్కువ సమయంలో బ్రిడ్జి పనులను పూర్తి చేశామన్నారు. ఏడాది లక్ష్యంగా నిర్ధేశించుకుని నూతన బ్రిడ్జిని పూర్తి చేస్తున్నామన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.