రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుతో నీటి కష్టాలు తీరాయని, అంతకుముందు నీటి కోసం పడ్డ పాట్లు అన్ని ఇన్ని కావని, ప్రస్తుతం పల్లెలు సుభిక్షంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి, గోపాల్పేట మండలాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పార్టీలో చేరిన వనపర్తి మండలంలోని రాజపేట పెద్దతండాకు చెందిన సింగిల్విండో డైరెక్టర్ను కండువా కప్పి ఆహ్వానించారు.
గోపాల్పేట, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుతో నీటి కష్టాలు తీరాయని, అంతకుముందు నీటి కోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావని, స్వరాష్ట్రంలో పల్లెలు సుభిక్షంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఏదుట్లలో రూ.30 లక్షల నిధులతో నూతనం గా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జెడ్పీ చైర్మ న్ లోకనాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు నీటి రాకతో సాగు విస్తీర్ణం పెరిగి పల్లెలు పచ్చబడాయని, రాబోవు రోజు ల్లో నీటి సమస్య ఉండదని పుష్కలంగా పంటలు పండి తెలంగాణ పల్లెలు సుభిక్షంగా ఉంటాయన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ఉపాధి లభించడంతో పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాక గడప గడపకూ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. రైతులు వరి తగ్గించి ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. కూరగాయ పంటల సాగు వల్ల నిత్యం ఆదాయం పొందవచ్చన్నా రు. రాష్ట్రంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు నాలుగే ఉన్నాయని, కొత్తగా వనపర్తిలో అయిదోది తీసుకొచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో వైద్య, ఫార్మసీ కళాశాలలను మంజూరు చేయించామని, బీసీ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా మంజూరైనట్లు తెలిపారు. గ్రామానికి 147 కొత్త పింఛన్లు వచ్చాయన్నారు. గ్రామానికి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైందని, టెండర్ వర్క్ కూడా పూర్తయిందన్నారు.
గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం కొత్త పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపుకార్డులు, ప్రొ సీడింగ్స్, మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ మల్లయ్య, డీఈ అశోక్, ఏఈ సుధాకర్రెడ్డి, ఎంపీడీవో హుస్సేన ప్ప, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గ వి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీలు బాల్రెడ్డి, రేణుక, ఉప సర్పంచ్ క్రాంతి రావు, సిం గిల్విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతియాదవ్, గ్రామాధ్యక్షుడు శ్రీధర్రావు, కోఆప్షన్ సభ్యులు ఎండీ మతీన్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రాజేశ్ఆచారి, గ్రామాధ్యక్షుడు నీలాంబరావు, నాయకులు కోటీశ్వర్రెడ్డి, జయపాల్రెడ్డి, నర్సింహ, ధర్మయ్య పాల్గొన్నారు.
వనపర్తి, సెప్టెంబర్ 26: రజాకార్లను ఎదురించి ఎం దరో రైతులను పోరాట బాట పట్టించి దున్నేవాడిదే భూ మి అని ధైర్యాన్ని నింపి ప్రాణాలను ఫణంగా పెట్టి నిలిచిన వీర వనిత, తెలంగాణ అగ్ని కణం చాకలి ఐలమ్మ అని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలోని ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బందూక్ చేతబట్టి దొరల గుండెల్లో సింహ స్వప్నమై గర్జించి సాయుధ పోరాటాన్ని నడిపి రోకలిబండ చేతబూని దోపిడీ దొంగలు, భూస్వాములపై తిరగబడ్డ మహిళా శక్తి ఐలమ్మ అని మంత్రి గుర్తుచేశారు.
వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో పింఛన్ కార్డులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశా రు. ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పింఛన్లు మంజూరుచేశామని, మొత్తంగా 50 లక్షల మందికి ఆసరా కల్పిస్తున్నట్లు వివరించారు. అంజనగిరికి సాగునీరు తీసుకొస్తానని, పోడు భూముల సమస్యలు తీర్చి రైతుబంధు పథకం వర్తించేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాజపేట పెద్దతండాకు చెందిన సింగిల్విండో కాంగ్రె స్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ సోమవారం రేవల్లి మండలంలోని బండరావిపాకులలో మంత్రి ని రంజన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సావత్ జ యరాం నాయక్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆ హ్వానించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షే మ పథకాన్ని గ్రామాలు, తండాల్లోని ప్రజలందరికీ చే రేలా, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఆయా కార్యక్రమా ల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్లు కృష్ణ, నాయకులు శరవంద, పరంజ్యోతి, సింగిల్విండో చై ర్మన్ రఘువర్ధన్రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, వాటర్షెడ్ మాజీ డైరెక్టర్ బాలగౌడ్, యువజన సంఘం వనపర్తి మండలాధ్యక్షుడు చిట్యాల రాము, సీనియర్ నాయకు లు వెంకటేశ్నాయక్, కురుమూర్తినాయక్ ఉన్నారు.