భూత్పూర్, సెప్టెబంర్ 26 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ పనిచేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తె లిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటితరం యువత ఐలమ్మను ఆదర్శం గా తీసుకోవాలని సూచించారు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్ర ప్రభు త్వ అవార్డుకు ఎంపికైనందున చైర్మన్ బ స్వరాజ్గౌడ్, కమిషనర్ను ఎమ్మెల్యే స త్కరించారు. బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. అనంతరం భూత్పూర్, వెల్కిచర్ల, తాటికొండ, పోతులమడుగు, హస్నాపూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. పోతులమడుగులో 74 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎంపీపీ శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చా ర్జి సత్యనారాయణ, తాసిల్దార్ చెన్నకిష్టన్న, ఎంపీపీ ము న్ని, సర్పంచులు పద్మ, కమలమ్మ, సాయికుమార్, రాములమ్మ, ఎంపీపీలు పద్మ, సాయిలు, వెంకటేశ్వరమ్మ, ఊశ న్న, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, నాగమ్మ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, నర్సింహులు, రాములు, సురేశ్, ప్రేమ్కుమార్ ఉన్నారు.
అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల తెలిపారు. తాటికొండ గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు రొట్టె శేఖర్, నర్సింహులు, వెంకటయ్య, ఖాదరయ్యతో పాటు వంద మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. అలాగే కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మాజీ వార్డు సభ్యుడు రామకృష్ణ, సింగిల్విండో డైరెక్టర్ మాసన్న, బీఎస్పీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు 100 మంది అన్నాసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో వనపర్తి జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు శేఖర్రెడ్డి, మౌనిక పాల్గొన్నారు.