భూత్పూర్, సెప్టెంబర్ 19 : గ్రామాల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం చిన్నచింతకుంట మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 30 మంది, కాంగ్రెస్కు చెందిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే సమక్షంలో అన్నాసాగర్ గ్రామంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతవారితో కలిసి టీఆర్ఎస్ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో రాజు, భాస్కర్, పెంటన్న, నరేందర్, రాము, వెంకటేశ్, మహేందర్, రాజేశ్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 19 : మండలంలోని మల్లాపూర్లో కాంగ్రెస్కు చెందిన ఉపసర్పంచ్ రామచంద్రయ్య, 20 మంది కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరినట్లు ఉపసర్పంచ్ తెలిపారు. అనంతరం పెర్కివీడ్ గ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కార్యకర్త రాములు ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల సభ్యత్వం చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజేంద్రప్రసాద్గౌడ్, రాజవర్ధన్రెడ్డి, మాధవరెడ్డి, రాజీరెడ్డి, మాధవులు, రాఘవేందర్రెడ్డి, శ్రీధర్, కిశోర్ పాల్గొన్నారు.