ఊట్కూర్, సెప్టెంబర్ 19 : మక్తల్ నియోజవర్గంలో ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడు తూ ప్రతి గ్రామానికి తారురోడ్డు వేయించిన ఘనత ప్రభు త్వం, ఎమ్మెల్యేదేనన్నారు.
మక్తల్ మండలం లింగంపల్లి నుంచి మండలంలోని తిప్రాస్పల్లి వరకు మంజూరైన డబు ల్ రోడ్డు నిర్మాణ పనులను గతంలో బీజేపీ రాష్ట్ర నాయకు డు స్వతహాగా కాంట్రాక్టరైన జలంధర్రెడ్డి బంధువులు ఉ మామహేశ్వర్రెడ్డి, పుల్లారెడ్డి, సబ్ కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డి టెండర్ దక్కించుకొని నాసిరకం పనులు చేయడం వల్లనే రోడ్డు అధ్వాన్నస్థితికి చేరిందన్నారు. ఇదేక్రమంలో మక్తల్ నుంచి లింగంపల్లి వరకు, తిప్రాస్పల్లి నుంచి సింగారం క్రా స్ రోడ్డు వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం ఇప్పటి వరకు చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. కాగా, ఆదివారం స్థానిక బీజేపీ నాయకులు ఓ పక్క టెండర్లు పూర్తయి అధికారులు పనులు చేయిస్తుండగా కేవలం ప్రచారం కోసం మూడు ట్రి ప్పుల మట్టితో గుంతలను పూడ్చడం హాస్యాస్పదంగా ఉం దని ఎద్దేవా చేశారు.
బీజేపీ నాయకుల జిమ్మిక్కులు, గిమ్మిక్కులను భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలు విశ్వసించరని, మరోమారు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే సంబంధిత కాంట్రాక్టర్ల ఇంటి ఎదుట ధర్నా చేయాలని హితవుపలికారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని పీఎంజీవై నిధులతో ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామానికైనా రోడ్డు వేయించారా అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ నీటిని వాడుతున్న ప్రతి బీజేపీ కార్యకర్త కృతజ్ఞతగా తమ ఇంటి గోడపై సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలని వారు సూచించారు. బీజేపీ నా యకులకు మతిభ్రమించి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ రాజకీయాలతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శివరామరాజు, కతలప్ప, ఉపసర్పంచ్ ఒబేదుర్ రహిమాన్, యువజన విభాగం అధ్యక్ష, కార్యదర్శులు తరుణ్, ఆనంద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆర్. హనుమంతు, మైనార్టీ నాయకులు జమీర్, నాసీర్ఖాన్, షమీఉ ల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.