వేధిస్తే జైలు జీవితమే శరణ్యం..
ప్రేమ పేరుతో బాలికలను మోసగించడం.. లైంగిక వేధింపులకు పాల్పడడం.. అనుచితంగా ప్రవర్తించడం.. అభద్రతా భావం కలిగించడం నేరం.. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ఎంత కఠినంగా ఉందో తెలియని యువత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. చదువుకొని ఉన్నతంగా ఎదగాల్సిన వయస్సులో జైలుపాలవుతున్నారు. ఈ పోక్సో చట్టం బాలికలకు రక్షగా మారుతున్నది.
విలువైన భవిష్యత్ నాశనం..
బాలికలను ప్రేమించి చాలా మంది యువత జైలులో గడుపుతున్నారు. పోక్సో చట్టంపై అవగాహన లేక ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. బాలికలను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. చట్ట ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి యువకులను జైళ్లకు పంపిస్తున్నారు. చిన్న వయస్సులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహాలు చేసుకున్న వారిలో ఎక్కువ మంది యువకులు తరువాత వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో బాలికల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతున్నది. బాలికలు కూడా ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలి.జీవితంలో స్థిరపకుండానే ప్రేమ అవసరమా అని ఆలోచించాలి. 21 ఏండ్లు నిండిన తరువాతే జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. చిన్న వయస్సులో ప్రేమలో పడుతున్న చాలా మంది యువతులు మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. తమతో స్నేహం చేసే యువకుల నిజాయితీని గమనిస్తుండాలి. స్నేహితుడిగా ఉంటూనే హద్దు మీరి ప్రవర్తిస్తే మొదట్లోనే తల్లిదండ్రులకు చెప్పి దూరంగా ఉంచడం మంచిది. ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి.
చట్టంలో ఉన్నదేంటి..?
తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి..
బాలికలకు వివరిస్తున్నాం..