ఎనిమిదేండ్లుగా కొనసాగిన పనులు.. వ్యయం రూ.300 కోట్లకుపైగా.. కిలోమీటర్లు 57.. ఇటీవల విద్యుద్దీకరణ కోసం మరో రూ.56.92 కోట్లు ఖర్చు.. ఇలా సాగదీసి.. గద్వాల రాయిచూర్ మధ్య రైల్వే లైన్ ప్రారంభించారు. చివరకు పనులు పూర్తయ్యాక రైల్వే అధికారులు చేసింది ఏమిటంటే ఈ మార్గంలో కేవలంఒక రైలును మాత్రమే నడపడం. 2013లో డెమో రైలు ప్రారంభించి నడుపుతున్నా..
నేటికీ కొత్త రైళ్లు మాత్రం తిప్పడం లేదు. ఈ రైలును కూడా వారంలో ఆరు రోజులు మాత్రమే నడుపుతున్నారు. అనువైన సమయంలో కాకుండా మిగితా వేళల్లోతిప్పుతున్నారు. దీనికితోడు ఇటీవల ఎక్స్ప్రెస్గా మార్చడంతో పలు స్టేషన్లలో ఆగడం లేదు. దాంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైంది. కనీసం ఈ రైళ్ల రాకపోకలపై ప్రజలకు సమాచారం అందించే వ్యవస్థ కూడా
లేకుండా పోయింది. ఇందుకు రైల్వే అధికారుల అలసత్వం.. రూ.కోట్లు ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగదీసి.. సాగదీసి కో ట్లు ఖర్చు చేసి రైల్వేలైన్ వేస్తే ఎనిమిదేండ్లుగా ఆ మార్గంలో నడుస్తున్న రైళ్ల సంఖ్య ఎంతో తెలు సా. కేవలం ఒక్కటి. అవును ఒక్కటంటే ఒక్కటే. అదెక్కడో కాదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల రాయిచూరు మధ్య 57 కి.మీ. మా ర్గంలో నిర్మించిన రైల్వేలైన్ గురించే.. రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి పదేండ్లలో పూర్తి చేసిన రైల్వేలైన్ పరిధిలో 2013లో ఓ డెమో రైలు ప్రారంభించారు. ఆ తర్వాత మరో రైలు కేటాయించలేదు. ఉన్న రైలు కూడా ఎవరికీ అందుబాటులో లేని సమయాల్లో సుదీర్ఘంగా సమయాన్ని తీసుకుని తిప్పుతుండటంతో ప్రయాణికుల ఆదరణ కరువైంది. చివరకు గద్వాల-రాయిచూరు మధ్య ఈ రైలును ఎక్స్ ప్రెస్గా మా ర్చినా ఫలితం సున్నా. ఇటీవలే రూ.56.92 కో ట్లు ఖర్చు చేసి విద్యుద్దీకరణ పూర్తి చేసినా.. ఇం కా కొత్త రైళ్లకు మోక్షమే లేదు. వెనుకబడిన ప్రాం తాల్లో రైల్వే వ్యవస్థను బాగు చేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతామని ఓ వైపు ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. యూపీఏ హయాం లో పూర్తి చేసిన రైల్వే మార్గంలో అప్పుడు ప్రా రంభించిన రైలు తప్ప మరో రైలు ఇవ్వలేదు. అయినా బీజేపీ నేతలు మాత్రం తమ పాలన భేష్ అంటూ పొగడ్తలతో కాలం గడిపేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నా విమర్శలు చేసే బీజేపీ నేతలకు త మ సొంత ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం కనిపించదని స్థానికులు అంటున్నారు.
గద్వాల రాయిచూరు రైల్వేలైన్ ఎందుకు..?
రాయిచూరు గద్వాల మాచర్ల రైల్వేలైన్ ని ర్మించాలని నిజాం కాలం నుంచే ప్రతిపాదనలున్నాయి. దీని వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఏపీ, ఒడిస్సాతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని భావించారు. అయితే, కేంద్ర ప్రభుత్వాలు ఈ లైన్ను కేవలం గద్వాల-రాయిచూరుకే పరిమితం చేశారు. కిందామీద పడు తూ లేస్తూ 2013లో రైల్వే లైన్ పూర్తయింది. అక్టోబర్ 12, 2013లో కాచిగూడ గద్వాల రాయిచూరుకు డెమో రైలు ప్రారంభించారు. వారంలో ఆరు రోజులు మాత్రం తిరిగే ఈ రైలు సరిగ్గా గద్వాలలో సంత జరిగే సోమవారం మా త్రం నడవదు. సరైన వేళలు లేకుండా బాగా ఆ లస్యంగా నడవడంతో ఈ రైలు కాచిగూడ నుం చి రాయిచూరు చేరుకునేందుకు సుమారు 7 గంటలు పడుతుంది. గతంలో మరింత ఆల స్యం కూడా అయ్యేది. దీంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులెవరూ సాహసించలేదు. దీనికితోడు ఇటీవలే ఎక్స్ ప్రెస్గా మార్చి గద్వాల-రాయిచూరు మధ్య ఉన్న స్టేషన్లలో ఈ రైలు ఆ పడం లేదు. దీంతో ప్రయాణికులే కరువయ్యా రు. కనీసం ఈ రైళ్ల రాకపోకలపై ప్రజలకు సమాచారం అందించే వ్యవస్థ కూడా కరువైంది. దాం తో ఉన్న ఈ ఒక్క రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.
ఇలా చేస్తే బాగుంటుంది..
ఈ లైన్కు ఇటీవలే రూ.56.92కోట్లతో వి ద్యుత్ లైన్ కూడా పూర్తి చేశారు. గుంతకల్-రాయిచూరు-వాడి మార్గంలోనూ రైల్వే విద్యుద్దీకరణ పూర్తయింది. దీంతో గద్వాల నుంచి రాయిచూరు మీదుగా ముంబై, మంత్రాలయం వంటి స్టేషన్లకు రైళ్లు నడిపే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, ప్రస్తుతం కాచిగూడ నుంచి రాయిచూ రు వరకు మాత్రమే నడుస్తున్న డెమో రైలును మంత్రాలయం రోడ్ స్టేషన్ వరకు పొడిగిస్తే హై దరాబాద్, మహబూబ్నగర్, గద్వాల ప్రాంతా ల నుంచి భక్తులు మంత్రాలయం చేరుకునే సౌలభ్యం ఉంటుంది.
అలాగే నడుస్తున్న డెమో రైలు వేళలు సవరించాలి. రాయిచూరులో ఉదయం 6 గంటలకు బయలుదేరేలా చర్యలు తీసుకోవడంతోపాటు కాచిగూడ నుంచి రాయిచూరుకు బయలుదేరే రైలు కూడా ఉదయం వేళల్లో నడిచేలా చూస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగే వీలుంది. ప్రస్తుతం రైళ్ల వేగం పెరిగినందున ఇప్పుడున్న ఆరు గంట ల సమయాన్ని కనీసం నాలుగున్నర గంటలకు కుదిస్తే బస్సులో వెళ్లే ప్రయాణికులు సైతం రైళ్లకు క్యూ కడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నా రు. రాయిచూరు నుంచి గద్వాల మీదుగా క ర్నూలు, నంద్యాల, గుంటూరు, విజయవాడకు సైతం రైళ్లు తిప్పేందుకు అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కొత్త రైలుకు ప్రతిపాదనలు..
కాచిగూడ గద్వాల రాయిచూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైల్వే లైన్ వేళలను సవరించడంతోపాటు కొత్తగా మంత్రాలయం వరకు మరో రైలును ప్రవేశపెట్టాలని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి మంత్రాలయం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ఈ రైలు మార్గం ఎంతో అనువుగా ఉన్నందున అధికారులు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యుద్దీకరణ సైతం పూర్తయినందున కొత్త రైళ్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహబూబ్నగర్- గుంతకల్ మధ్య డబ్లింగ్ పూర్తయితే ఈ మార్గంలో రైళ్ల సంఖ్య మరింతగా పెరుగుతుంది.
గోపాల్, రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు