ఆత్మకూరు, సెప్టెంబర్ 25 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో శనివారం రాత్రి జూరాల డ్యాంకు 55,450 క్యూసెక్కు ల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో మూడు గేట్లెత్తి 18,438 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 975 క్యూసెక్కులు, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 850, భీమా-1కు 650, భీమా-2కు 750 క్యూసెక్కులు వదిలారు. విద్యుదుత్పత్తికి 36,302 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల నుంచి 4.905 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరగ్గా ఇప్పటి వరకు 205.310 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 4.25 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరగ్గా మొత్తంగా 227.165 మి.యూ. విద్యుదుత్పత్తి కొనసాగింది. ప్రా జెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉం డగా.. 9.214 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మొత్తంగా 58,756 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది.
తుంగభద్ర డ్యాంకు నిలకడగా..
అయిజ, సెప్టెంబర్ 25 : కర్ణాటకలోని ఎగువ ప్రాం తంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతున్నది. శనివారం ఇన్ఫ్లో 8,698 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10,352 క్యూసెక్కులుగా న మోదైంది. సామర్థ్యం 100.855 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 100.470 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 10,300 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ప్రస్తుతం ఆనకట్టలో 9.1 అడుగుల నీటిమట్టం ఉండగా.. ప్రధాన కాల్వకు 443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి స్వల్పంగా..
శ్రీశైలం, సెప్టెంబర్ 25 : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. శనివారం జూరాల ప్రాజెక్టు నుంచి 28,748, విద్యుదుత్పత్తి నుంచి 35,594, సుంకేసుల నుంచి 12,933.. మొత్తం 77,275 క్యూసెక్కులు విడుదల కాగా, మధ్యాహ్నం వరకు రిజర్వాయర్కు 46,082 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా నమోదైంది. ఏపీ పవర్ హౌస్కు 30,850, టీఎస్ పవర్హౌస్కు 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగుల వద్ద ఉన్నది.