జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 25 : భర్త వేధింపులు తట్టుకోలేక మహిళా సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం లోని నసుర్లాబాద్ తండాలో చోటు చేసుకున్నది. సీఐ వీరాస్వామి, స్థానికుల కథనం మేరకు.. నసుర్లాబాద్ తండా సర్పంచ్ పాల్త్యావత్ సిరి(30)కి అదే తండాకు చెం దిన శ్రీనివాస్తో 2010లో ప్రేమ వివాహం జరిగింది. వీరి కి ఇద్దరు మగపిల్లలు. ఆమె భర్త శ్రీనివాస్కు అదే తండాలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసిం ది. దీంతో కొన్ని నెలలుగా భర్త నుంచి ఆమె వేధింపులకు గురయ్యేది. ఈ క్రమంలో ఈ నెల 14న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమె ను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు శంక ర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తండా నుంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సిరి మృతి చెందడంపై తండాలో విషాదం నెలకొన్నది.
కొద్దిసేపు ఉద్రిక్తత..
సర్పంచ్ ఆత్మహత్యకు అదే తండాకు చెం దిన మహిళ కారణమని ఆరోపిస్తూ మృతురా లి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సదరు మహిళ ఇంటిపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకున్నది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బందోబస్తు ఏ ర్పాటు చేశారు. సిరి మృతి చెందిన విషయాన్ని తెలుసుకు న్న సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, జడ్చర్ల మండలాధ్యక్షుడు సుందర్రెడ్డి, సర్పంచులు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్ శనివారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.