డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ రాము
ఊట్కూర్, ఏప్రిల్ 11 : 45 ఏండ్లు దాటిన మహిళలందరూ కొవిడ్-19 వ్యాక్సిన్ టీకాలు వేయించుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ రాము పిలుపునిచ్చారు. పట్టణంలోని పీహెచ్సీలో మండలంలోని మహిళా సంఘాల సభ్యులకు ఆదివారం టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ రెండో దశలో విస్తరిస్తున్నదని పేర్కొన్నారు. రోజూరోజూకూ కేసులు అధికమవుతు న్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్త గా కొవిడ్-19 నింబంధనలను పాటించాలన్నారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం టీకా తయారు చేశారన్నా రు. ప్రజలందరూ క్షేమం కోసం టీకా ను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన వారికి కూడా టీకా వే యాలన్నారు. దీనిపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. ఆయా మహిళా సంఘాల్లో పని చేస్తున్న పీఆర్అండ్పీడీ, ఫ్రంట్లైన్ వర్కర్లు, గ్రా మీణాభివృద్ధి శాఖ సిబ్బంది టీకాలు వే సుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం నారాయణ, సీసీలు, మహిళా సమాఖ్య మండలాధ్యక్షురాలు రాజేశ్వరి, వీవోఏలు తదిత రులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్కు స్పందన
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఊట్కూర్ ప్రభుత్వ దవాఖానలో 92 మంది, పులిమామిడిలో 40 మందికి టీ కా వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన వారికి టీకా వేస్తుండడంతో అర్హులు పీహెచ్సీలకు వస్తున్నట్లు వైద్యులు శ్రీకాంత్రెడ్డి, నరేశ్చంద్ర తెలిపారు. దవాఖానల్లో ప్రజలకు అన్ని వసతులను కల్పిస్తున్నామన్నా రు. స్థానికులతోపాటు ఐకేపీ సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.