నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 11: ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఫొటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ కోరారు. ఆదివారం నాగర్కర్నూల్లోని రూబీ గార్డెన్స్లో జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయనతోపాటు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, డీజీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు జిల్లా కమిటీ, నాలుగు తాలూకాలు, మండలాల కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా దృష్టాయ ఫొటోగ్రాఫర్లు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఫొటోగ్రాఫర్లకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మర్రి ఆదేశాల మేరకు డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఫొటోగ్రాఫర్ల కోసం స్థలం సేకరించి భవనం నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఫొటోగ్రాఫర్లు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ప్రతినిధులు రవీందర్, జగదీశ్, కాశీరత్నం, రవీందర్, చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి చెన్నకేశవులు, కోశాధికారి భూషపాగ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జాను, షకీల్, ప్రధాన కార్యదర్శి హరీశ్, అనిల్, కృష్ణ, తాలూకా అధ్యక్షుడు వీరేందర్, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి కుర్మయ్య, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష్య, కార్యదర్శులు పాల్గొన్నారు.